ఆంధ్రప్రదేవ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఐదోరోజే కాస్త క్షీణంచిన ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరింత విషమించిందని వైద్యులు తెలిపారు. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయని వారు తేల్చి చెప్పారు. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. దీనివల్ల శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా వుందని.. గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.
వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని ఆయన వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం జగన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన్ను దీక్ష విరమించాలని కోరారు. కానీ.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనైనా దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పేశారు.
మరోవైపు.. జగన్ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు, వైకాపా శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తల్లి విజయమ్మ హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరగా.. బెంగళూరులో వున్న జగన్ సోదరి షర్మిల కూడా అక్కడి నుంచి పయనమయ్యారు. కాగా ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ - 61; బ్లడ్ యూరియా - 26; సీరమ్ క్రియాటిన్ -1; టోటల్ బైలురూబిన్ - .6, ఎస్జీఓటీ- 44; ఎస్జీపీటీ - 20; ఆల్కలైన్ - 75; సోడియం - 150; పొటాషియం - 5.1; క్లోరైడ్స్ - 106; బైకార్బనేట్స్ - 13 చొప్పున ఉన్నాయి. అంతకుముందు తీసుకున్న ర్యాండమ్ బ్లడ్ సుగర్ విలువలు సరిగా రావని, అందుకే ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ పరీక్ష చేశామని డాక్టర్ రమేశ్ వివరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more