ఓ మహిళపై ఇద్దరు అత్యాచారం చేస్తే కూడా గ్యాంగ్ రేపేనా? అది సామూహిక అత్యాచారం ఎలా అవుతుంది. గ్యాంగ్ రేప్ చేయాలంటే కనీసం ముగ్గురు నలుగురు ఉండాలన్న విషయం మీకు తెలుసా..? ఈ మాటలేవో సాదాసీదా వ్యక్తి అన్నవి కాదు. సాక్షాత్తూ కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్ నోటి వెంట జాలువారిన పదాలు. ఇద్దరు రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎలా అవుతుందంటూ మంత్రిగారు మీడియానే ఎదురు ప్రశ్నించారు. ముగ్గురు నలుగురు కలిసి చేస్తేనే అది గ్యాంగ్ రేప్ అవుతుందంటూ సరికొత్త భాష్యం చెప్పారు. అక్టోబరు 3వ తేదీన బెంగళూరులో ఓ బీపీఓ ఉద్యోగిని(22)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటనపై ఆయన పై విధంగా స్పందించారు.
ఉద్యోగినిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తమ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు. మహిళల రక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని వివరించారు. పనిలో పనిగా ఇద్దరు వ్యక్తులు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని, ముగ్గురు, నలుగురు కలిసి చేస్తేనే గ్యాంగ్ రేప్ అవుతుందంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు.
మంత్రి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాలుక కరుచుకున్న మంత్రి.. ఆనక తాపీగా క్షమాఫణలు చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ కూడా మండిపడిన తరువాత తన తప్పును తెలుసుకున్న మంత్రిగారు క్షమాపణలు చెప్పారు. అయితే మంత్రి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్లోనే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా కావాలనే సెక్స్ పరమైన వార్తలను ఎక్కువ చేసి చూపిస్తోందంటూ అక్కసు వెళ్లగక్కారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more