బీహార్ మొదటిదశ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఒకే రోజు నాలుగు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అవకాశవాదులకు, అహంకార నేతలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలన్నారు. బీహార్ తొలి దశ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రధాని మోడీ గేరు మార్చారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొన్నారు. తన మాటలతో జనం మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలకు జనసమీకరణ అంతా ప్రణాళిక ప్రకారం సాగడంతో ప్రచారసభలు గ్రాండ్ గా సాగాయి. మొత్తానికి ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొలది సుడిగాలి పర్యటనలు, బహిరంగ సభలతో మోదీ టాప్ గేర్ వేశారు.
ముంగేర్...బెగుసరాయ్...సమస్తీపూర్...సభ ఏదైనా...ప్రజలు మాత్రం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సభలకు హాజరైన జన సందోహాన్ని చూసిన ప్రధాని మోడీ ఎన్డీయే పక్షాల విజయం తథ్యమన్నారు. బీహార్ లో ఎక్కడికివెళ్లినా...హాజరైన భారీ జన సందోహం చూస్తే, రాష్ట్ర సర్కార్ పై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్పష్టమవుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ అహంకారపూరితంగా వ్యవహరించిన నేతలకు ఎలా బుద్ధిచెప్పారో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుణపాఠం నేర్పాలని సూచించారు. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న ముంగేర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటైన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ లాలూప్రసాద్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. హిందువులు కూడా పశుమాంసం తింటున్నారంటూ వ్యాఖ్యానించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారన్నారు. లాలూ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పడంతో ఆ సమయంలో సైతాన్ పూనిందని సమాధానమిచ్చారని, కోట్లాదిమంది ప్రజలుండగా సైతాన్, లాలూనే ఎందుకు ఎంచుకుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more