తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి అధికారంలో ఉన్న నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అందరూ కూడా ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. అయితే ఉద్యమం ముగిసింది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం.. అప్పుడే ఏడాదిన్నర కూడా గడిచింది. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద మాత్రం ప్రభుత్వం ఊసెత్తడం లేదు. ఎప్పుడుప్పుడా అని ఎదురుచూస్తున్న రెగ్యులరైజేషన్ మీద కేసీఆర్ మాత్రం దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు. అయితే తాజాగా ఓ మంత్రి మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అని అంటున్నారు.
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద స్పందించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలోనే పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. అయితే ఔట్ సోర్సింగ్ ద్వారా వచ్చిన ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని అన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తొందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని గుర్తు చేశారు. మొత్తానికి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజా ప్రకటన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more