చపాతీలు ఏ రూపంలో వుంటేనేం.. తినడానికి దొరికితే ఎవరైనా లాగించేస్తారు. రంగు, రుచి అంటూ పట్టింపులేమీ లేకుండా కడుపు నింపుకుంటారు. కానీ.. ఓ కసాయి తండ్రి మాత్రం చపాతీలు గుండ్రంగా చేయలేదన్న కారణంతో కన్నకూతర్నే దారుణంగా కొట్టి చంపేశాడు. ఇందుకు తన కొడుకు సహాయం కూడా తీసుకున్నాడు. మరోసారి తప్పు దొర్లకుండా గుండ్రంగా చపాతీలు చేస్తానంటూ ఆ అమ్మాయి మొరపెట్టుకుంటున్నప్పటికీ.. ఆ కసాయి తండ్రి మానవత్వం లేని మృగంలా దారుణంగా కొట్టాడు. దీంతో ఆ అమ్మాయి చనిపోయింది. ఈ ఘటన పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పాకిస్తాన్ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామాబాద్లోని అజీమ్ పార్క్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తికి అనీఖా అనే పదమూడేళ్ల కూతురు వుంది. తనకు చపాతీలు చేసివ్వమని చెప్పగా.. ఆ అమ్మాయి వెంటనే సిద్ధం చేసింది. అయితే.. చపాతీలు గుండ్రంగా లేవని ఆ కసాయి తండ్రి అనీఖాని చావబాదాడు. అతని కొడుకు కూడా ఆ అమ్మాయిని దారుణంగా కొట్టాడు. తనను వదిలిపెట్టమని ఎంతో ఆవేదనతో వేడుకున్నప్పటికీ.. ఆ తండ్రీకొడుకులిద్దరి మనస్సు కరగలేదు. ఇంకా గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. ఆ దెబ్బల్ని వేగలేకపోయిన ఆ చిన్నారి.. స్పృహ కోల్పోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆ తండ్రీకొడుకులు.. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే.. మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. దాంతో వాళ్లు ఆమె మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న పొలాల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ దిశగా వెళుతున్న కొందరు వ్యక్తులు మృతదేహాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. ఆ చిన్నారిని తామిద్దరం తీవ్రంగా కొట్టినట్లు తండ్రి, కొడుకు ఇద్దరూ అంగీకరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more