భారతీయ రిజర్వు బ్యాంకు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకున్న 638 మంది తమ దగ్గర నల్లధనం ఉందని వెల్లడించారు. 638 మంది తమ వద్దు సుమారుగా 3,770 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ అనితా కపూర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-ఫైలింగ్ పోర్టల్ ను బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా తెరచివుంచినట్టు సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ తెలిపారు. నిన్నటితో ముగిసిన ఈ సింగిల్ విండో విధానానికి మంచి స్పందిన వచ్చిందని తెలిపారు.
ఇప్పటివరకు వివరాలు వెల్లడించిన వారు పన్నులు, బకాయిలు చెల్లించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని వెల్లడించారు. నల్లధనం వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ విధానం కింద తమ వద్దనున్న నల్లధనం వెల్లడించిన వారికి ఫెమా కింద చర్యలు తీసుకోబోమని భారతీయ రిజర్వు భ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో 638 మంది ముందుకు వచ్చి వారి నల్లధన వివరాలను వెల్లడించారు. బయటికి వెల్లడించని విదేశీ ఆస్తులు కలిగిఉన్న వ్యక్తులెవరైనా వాటి వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని(వన్టైమ్ కాంప్లియన్స్ విండో) కల్పించింది.
గడుపులోపు వెల్లడించిన మొత్తం ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఈ చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంటుంది. కాంప్లియన్స్ విండో గడువు ముగింపు తేదీ తర్వాత వివరాలను వెల్లడించినట్లయితే మొత్తం విలువలో 120 శాతాన్ని పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సివుంటుంది. దీంతో నల్లధన కుబేరులు స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారి బ్లాక్ మనీ వివరాలను తెలియజేసేందుకు ముందుకు వచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more