ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు రాసిన ఓ లేఖ బాబు గారి చెంప చెళ్లుమనిపించేలా ఉంది. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఓ రైతు రాసిన లెటర్ లో ఎంతో ఆవేదన, నిస్సహాయత, నిసృహ కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారి డాడు ప్రదర్శనకు చేస్తున్న ఖర్చులో కనీసం కొంతమాత్రం కూడా రైతుల కోసం ఎందుకు ఖర్చు చెయ్యడం లేదని ప్రశ్నించారు. పొగాకు రైతులు అప్పుల కుంపటలో మగ్గుతున్నా.. తమ జీవితాలను అర్దంతరంగా ముగింపునిస్తున్నా ప్రభుత్వంలో మాత్రం మార్పు రావడం లేదు. చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ పర్యటనలు చెయ్యడానికి వస్తుంది... ప్రత్యేక వమానాల్లో సింగపూర్, మలేషియాల్లో పర్యటించడానికి వస్తుంది కానీ రైతుల కోసం మాత్రం ఏమీ చెయ్యడానికి రాదా అని సూసైడ్ లెటర్ లో ప్రశ్నించారు.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఐదున్నర కోట్లు ఖర్చు చేసి కొత్తగా బస్సును కొనుక్కోవడానికి వస్తుంది.. కానీ 14 వేల మంది పొగాకు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటే మాత్రం పట్టించుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావా..? అని ప్రశ్నించాడు ఓ రైతు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వర్ రావ్ అనే రైతు తన భూమిలో పొగాకు సాగుచేస్తున్నారు. గత కొంత కాలంగా మారిన వాతావరణ పరిస్థితులకు తోడు.. గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్ రావ్ ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీస్తూ రాసిన లెటర్ సంచలనం రేపుతోంది. అయితే కనీస రైతు రాసిన లెటర్ గురించి తెలిసిన తర్వాతైనా చంద్రబాబు నాయుడులో ఏమైనా మార్పులు కనిపిస్తాయేమో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more