విపక్ష పార్టీపై విమర్శలు చేయడంలో తానెప్పుడూ ముందుంటానని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు నిరూపించుకుంది. అవకాశం దొరికితే చాలు.. టీడీపీ, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆమె మరోసారి సంచలన కామెంట్లు చేసింది. బాబు తన సొంత స్వలాభాల కోసం ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఆమె ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలు తుడిచిపెట్టుకోవడం కోసం ప్రజలకు మాయమాటలతో మభ్యపెట్టి, కేంద్రం వద్ద నాటకాలాడుతున్నారని రోజా ఘాటు విమర్శలు చేసింది.
ఈనెల 26వ తేదీన వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్ష కోసం ఎంపిక చేసిన దీక్షా స్థలాన్ని పరిశీలించేందుకు రోజు గుంటూరు వెళ్లింది. అక్కడికి చేరుకుని స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఆమె చంద్రబాబుపై ఫైరయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారని ఆమె పేర్కొంది. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఒత్తిడి చేయలేకపోతున్నారని ఆరోపించింది. తన సొంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాల్ని బాబు కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని రోజా విమర్శించింది. మరి.. ఈమె కామెంట్లకు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more