కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో భారత్ ధేశం తరపున పోరాడుతన్న ఒకే ఆశాకిరణం.. ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తున్నాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో అంచనాలకు దూరంగా బరిలోకి దిగిన అజయ్ జయరామ్ మాత్రం ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ.. తన సత్తాను కొనసాగిస్తున్నాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లో తొలి రౌండ్ లో విక్టర్ అక్సెల్ సన్ ను ఓడించినప్పటి నుంచి ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. వెనుదిరిగి చూడకుండా ముందుకుదూసుకుపోతున్న జయరామ్ ఫైనల్ కు చేరాడు. నిన్న జరిగిన క్వార్టర్ లో జపాన్ ఆటగాడు షో ససాకీని ఖంగుతినిపించిన జయరామ్.. ఇవాళ జరిగిన సెమీస్ లోనూ చైనా ఆటగాడిని మట్టికరిపించాడు.
శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జయరామ్ 21-19, 21-15 తేడాతో వరల్డ్ ఏడో ర్యాంక్ ఆటగాడు చౌ తెన్ చెన్(చైనీస్ తైపీ) )పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జయరామ్.. చౌ చెన్ ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. కేవలం 43 నిమిషాల వ్యవధిలోనే జయరామ్ సెమీ ఫైనల్ పోరును ముగించాడు. ప్రస్తుత సీజన్ లో ఇదే ప్రత్యర్థిని జర్మన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లలో బోల్తా కొట్టించిన జయరామ్ అదే ఊపును కొరియన్ ఓపెన్ లో కూడా కొనసాగించాడు. తొలి గేమ్లో జయరామ్ 11-8తో ముందంజంలో పయనించినా.. ఆ తరువాత కాస్త వెనుకబడ్డాడు. అయితే ఎట్టకేలకు తొలి సెట్ ను గెలుచుకున్న జయరామ్ ఆధిక్యం సంపాదించాడు.
ఆ తరువాత సెట్ లో తొలుత 3-0 తో జయరామ్ ఆధిక్యం సాధించినా.. తరువాత తేరుకున్న చెన్ వరుస పాయింట్లు సాధించాడు. ఓ దశలో రెండో సెట్ కోసం ఇరువురి మధ్య సాగిన పోరు ఉత్కంఠను రేపింది. జయరామ్ -చెన్ ల స్కోరు 12-12 వద్ద ఉండగా వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కాగా, ఆ తరువాత చెన్ 15-14 తో ముందుకు దూసుకువెళ్లాడు. ఇలా ఇరువురి మధ్య కాసేపు దోబుచులాడిన రెండో సెట్ ను జయరామ్ కైవసం చేసుకుని చెన్ కు చెక్ పెట్టాడు. ఈ తాజా గెలుపుతో జయరామ్ తుదిపోరులో చెన్ లాంగ్ తో తలపడనున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more