కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే...కనిపించని నాలుగో సింహమే పోలీస్.. పోలీస్.. అంటూ డైలాగ్ లు వినే ఉంటాం. కానీ పోలీసులు ఎంత డ్యూటీ మైండెడో, ఎంత కరప్షన్ కు కేరాఫో అందరికి తెలుసు. అయితే పోలీసులు అందరూ అలానే ఉంటారు అని కాదు. ఎంతో మంది పోలీసులు తమ సేవలను సమాజానికి అందిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మన రక్షణలో పాలుపంచుకుంటున్నారన్నది మాత్రం చాలా మందికి గుర్తుండదు. అయితే ఓ ట్రేయినీ కానిస్టేబుల్ చేసిన సాహసం.. అతడి డ్యుటీ అందరి చేత సెల్యూట్ కొట్టించుకుంటోంది. పోలీస్ అంటే వీడేరా అంటూ అందరిచేత మన్ననలు పొందుతున్నారు. ఇంతకీ అతడు ఏం సాహసం చేశాడో తెలుసా.?
కుంభమేళా పుష్కరాల్లో భాగంగా గోదావరి జన్మస్థానమైన నాసిక్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారు. వార్దా జిల్లాకు చెందిన 24 ఏళ్ల ట్రైనీ కానిస్టేబుల్ మనోజ్ నాసిక్ లో పుష్కర పనుల్లో తాత్కాలిక విధులు నిర్వర్తించడానికి వచ్చాడు. అమర్ ధామ్ బ్రిడ్జ్ పై పెట్రోలింగ్ చేయడానికి సోమవారం సాయంత్రం అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో కలిసి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బ్రిడ్జ్ పైనుంచి వ్యక్తి దూకడం చూశాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయలేదు. అయితే మనోజ్ మాత్రం వెనకా ముందూ ఆలోచించకుండా వెంటనే 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పైనుంచి దూకాడు. నీటిలో మునిగుతున్న వ్యక్తిని కాపాడాడు.ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకి చిక్కింది. దీన్ని చూసిన కలెక్టర్, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ గెడెం, ట్రైనీ కానిస్టేబుల్ దైర్యసాహసానికి ముగ్దుడై పొగడ్తలతో ముంచెత్తాడు. మనోజ్ బ్రిడ్జ్ పైనుంచి దూకుతున్న ఫోటోతో, వ్యక్తి ప్రాణాన్ని కాపాడినందుకు సెల్యుట్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇలాంటి పోలీసుల అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. కానిస్టేబుల్ మనోజ్ కు మనసారా చేస్తున్నాం సెల్యూట్...
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more