ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు అని తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కానీ కాబూల్ లో ఉంటున్న ఖైదీలు అచ్చంగా ఒక్కొక్కరు కాదు ఏకంగా 350 మంది కలిసి ఎస్కేప్ అయ్యారు. జైల్ లో ఉండేది అసలే కన్నింగ్ ఫెలోస్ మరి. వారికి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకుంటారా ఏంటీ..? సందు దొరికితే చాలు ఖైదీలందరూ కట్టగట్టుకొని వెళ్లిపోయిన ఘటన కాబూల్ లో చోటుచేసుకుంది. ఇక ఖైదీలందరూ పారిపోయాక.. వారి కొసం వెతకడం పోలీసుల పనైపోయింది. మొత్తానికి సినిమా స్టైల్లో జరిగిన 350 మంది ఖైదీల పరారీ మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ అంత మంది ఎలా తప్పించుకున్నారో తెలుసా..? గోడకు కన్నం కొట్టి. అవును జైలు గోడలకు పెద్ద కన్నం కొట్టి అందులోంచి పారిపోయారు. అవును ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.
కాబూల్ లో తాలిబన్ ఉగ్రవాదులకు అక్కడి పోలీసులకు ఎప్పుడూ పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే అలాగే స్థానిక కాలమానం ప్రకారం అక్కడ అర్దరాత్రి రెండు గంటల సమయంలో తాలిబన్ ఉగ్రవాదులు జైలు మీద బాంబ్ లతో దాడికి దిగారు. కారులో భారీగా బాంబ్ లు వేసుకొని వచ్చి.. జైలు మెయిన్ డోర్ ను గుద్ది లోపలికి ప్రవేశించారు. పోలీసుల డ్రెస్ లో వచ్చిన ఉగ్రవాదులు పోలీసులను కాల్చి చంపారు. అయితే ఇదంతా జరుగుతుండగానే ఖైదీలు గోడకు కన్నం వేసి.. వెనకాల నుండి పారిపోయారు. అసలు విషయం అందరికి అర్థం అయ్యేలోపు 350 మంది ఖైదీలు జంప్ అయ్యారు. సినిమా స్టోరీలాగా 350 ఖైదీల ఎస్కేప్ భలే ధ్రిల్లింగ్ గా ఉంది కదా.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more