భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియాను ఏ లెవల్ లో వాడుతున్నారో.. సోషల్ మీడియాలో తనకంటూ ఏ స్థానాన్ని సంపాదించారో అందరికి తెలుసు. అయితే తాజాగా మోదీజీ ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ తో సమావేశం కానున్నారు. ఫేస్ బుక్ ద్వారా డైరెక్ట్ గా ప్రజలతో ఇంటరాక్ట్ కానున్నారు. ఫేస్ బుక్ వేదికగా ప్రజలు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పనున్నారు. ప్రపంచం మొత్తం ఫేస్ బుక్ మాయలో ఉంటే.. మోదీ అదే టాపిక్ ను క్యాచ్ చేసి.. తన స్ట్రాటజీని చూపిస్తున్నారు. అంతా బాగానే ఉంది.. ప్రతి చోట మోదీ , షేస్ బుక్ గురించే మాట్లాడుతున్నారు. అయితే మోదీ, ఫేస్ బుక్ మధ్యలో క్యాండీక్రష్ వచ్చి చేరింది. అవును.. క్యాండీక్రష్ గేమ్ గురించి తెలియని వాళ్లు ఎవరూ లేరు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యాండీక్రష్ గేమ్ తో టైంపాస్ చేస్తుంటారు. అయితే మోదీ క్యాండీక్రష్ మీద ఓ కంప్లైంట్ ఇవ్వనున్నారా..? అన్న చర్చ అన్ని చోట్లా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గేమ్ లందు.. క్యాండీక్రష్ వేరయా అన్నట్లు.. ఎన్నో గేమ్ లు ఉన్నా కానీ క్యాండీక్రష్ ఫాలోయింగ్ మాత్రం అదిరిపోయింది. అయితే ఆడేవాళ్లు ఆడుతూనే ఉన్నారు. గేమ్ లాస్ అయిన వారు మరో స్టేజ్ కు, లైఫ్ కోసం సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్ బుక్ లో క్యాండీక్రష్ గేమ్ నోటిఫికేషన్ పంపిస్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో చాలా నోటిఫికేషన్లు క్యాండీక్రష్ గురించే ఉండటం ఫేస్ బుక్ లవర్స్ కు చిరకు తెప్పిస్తోంది. అందుకే ఎలాగూ.. మన మోదీ గారు ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ ను కలుస్తున్నారు కదా.. కాబట్టి మన ప్రాబ్లం చెప్పుకుంటే తీరుస్తారని అనుకున్నారు. ట్విట్టర్ ద్వారా మోదీ గారికి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అయ్యా మోదీ గారు ఫేస్ బుక్ లో క్యాండీక్రష్ నోటిఫికేషన్ల గొడవ ఎక్కువైంది. కాబట్టి వాటిని ఆపించండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి మోదీ గారు అందరికి రిక్వెస్ట్ ను మన్నించి మార్క్ జుకెన్ బర్గ్ కు నిజంగా కంప్లూంట్ చేస్తారా..? లేదా వదిలేస్తారా చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more