దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతూనే వుంది. ఈ కేసును తప్పుదోన పట్టించేందుకు ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఇప్పటికే ఎన్నో కథలు అల్లగా.. పోలీసుల విచారణలో భాగంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ విధంగా అయితే కూతురు షీనాని తల్లి ఇంద్రాణి హతమార్చిందో.. అలాగే తన కొడుకుగా ప్రపంచాన్ని పరిచయం చేసిన మిఖాయిన్ ని చంపేందుకు పథకం రచించినట్లు ఆమధ్య పోలీసులకు తెలియడంతో మరో కేసు ఆమెపై నమోదు చేశారు. ఆ సందర్భంలో మిఖాయిల్ తన కొడుకే కాదంటూ ఇంద్రాణి సంచలనం సృష్టించింది. అంతకుముందు షీనా అమెరికాలో బతికే వుందంటూ మరో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే! ఇలా ఎన్నో ట్విస్టుల నడుమ నడుస్తున్న ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది.
షీనాబోరా హత్యకు గురవ్వడానికి ముందు తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాని అనునిత్యం బ్లాక్ మెయిల్ చేసిందట. తన గత జీవితాన్ని బట్టబయలు చేస్తానంటూ తల్లిని షీనా బెదిరించేదట. ముంబైలోని అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ కావాలని కోరిందట. అది కొనివ్వకుంటే, ఇంద్రాణి గత జీవితపు రహస్యాలను బయట పెడతానని బెదిరించిందనట్లు విచారణలో తేలింది. ఈ విధంగా షీనా బెదిరింపులకు పాల్పడడటంతో.. ఇంద్రాణి తీవ్ర ఆగ్రహానికి, మనోవేదనకు గురై ఆమెను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. షీనా మెడకు తాడు బిగించి హత్య చేసే క్రమంలో ఆమె నోరును గట్టిగా మూసిన తరువాత, ఇంద్రాణి పదేపదే ‘ఇక తీస్కో నీ త్రీ బెడ్ రూం ఫ్లాట్’ అంటూ పిచ్చిగా అరిచిందట. ఈ విషయాన్ని కారు డ్రైవర్ రాయ్ పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. పీటర్ ముఖర్జియాకు చెందిన ఆస్తి లావాదేవీలు కూడా హత్యకు మరో కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more