అమరావతి జిల్లాలో మరో దారుణం జరిగింది. దళిత వివాహితపై ఏడుగురు మృగాళ్లు తమ పైశాచికత్వంతో విరుచుకుపడి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. తనను ఆర్థిక సాయం చేస్తామని నమ్మబలకడంతో.. విశ్వసించిన దళిత వివాహితపై సాయం చేస్తానన్న వ్యక్తి సహా ఏడుగురు అమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులలో ఇద్దరు మైనర్లు కూడా వున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చండూర్ బజార్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తన భర్తతో బేధాభిప్రాయాల కారణంగా.. తన ఏడేళ్ల కూతురుతో దూరంగా వుంటున్న దళిత వివాహత తన కుటుంబపోషణ నిమిత్తం తమ గ్రామంలోని ఓ పరిచయస్తుడు సందీప్ థాక్రేను 1500 రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. సాథ్యమైనంత త్వరగా ఆ డబ్బును తాను తిరిగి చెల్లిస్తానని కూడా చెప్పింది. అయితే ఇదే అదనుగా భావించిన ఆ క్రూరుడు.. అమెను రిద్దాపూర్ పట్టణానికి రావాలని.. అక్కడ తాను అడిగిన డబ్బును సమకూరుస్తానని చెప్పాడు. అయితే తన మిత్రుడిని పంపిస్తానని అతనితో కలసి రావాలని చెప్పాడు.
అనుకున్నట్లుగానే సందీప్ ధాక్రే మిత్రుడు అమె ఇంటికి వెళ్లి బైక్ పై అమెను కూర్చోబెట్టుకుని జాల్నాపూర్-రిద్దాపూర్ రహదారి మార్గంలోని ఫామ్ హౌజ్ కు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే అమెపై సందీఫ్ థాక్రే సహా శివ జామ్థే, సంతోష్ లఖన్ సంస్కార్, ప్రఫుల్లా వాఘ్దే సహా ఇద్దరు మైనర్ యువకులు కూడా అమెపై తెగబడి సామూహిక అత్యాచారం చేశారని భాదితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదుమేరకు నిందితులను అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులపై అత్యాచార కేసులతో ఎస్సీ, ఎస్టీ అక్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్లు చండూర్ బాజార్ సిఐ ఎస్.ఆర్ రాజ్ పుత్ తెలిపారు. ఈ కేసును తమ డీఎస్సీ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more