తెలంగాణలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద మీడియా వస్తున్న వరుస కథనాలతొ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ లో, అది కూడా సచివాలయానికి దగ్గరలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం మీద మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఎంక్వైరీ చేసింది. చైనా పర్యటనలో ఉన్న కేసీఆర్ సైతం రైతు ఆత్మహత్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింబయ్య ఆత్మహత్య అన్ని వివరాలు సేకరించింది ప్రభుత్వం. పంటనష్టం వల్ల కాకుండా.. అనారోగ్య కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రాధమిక నివేదికను సర్కారుకిచ్చారు అధికారులు.
రుణాలు లభించక, పంటలు ఎండిపోయి, అప్పుల భారం పెరిగిపోయి..తీవ్ర మనోవ్యథకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నదాతలు. రాజధానిలో సచివాలయం సమీపంలో రైతు లింబయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది సర్కార్. ఈ ఘటనపై చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్...వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులను నివేదిక కోరారు. దీంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహంచారు. లింబయ్య ఆత్మహత్యపై... ఆయన గ్రామం నుంచి వివరాలు తెప్పించుకున్నారు.
లింబయ్య స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా రామరెడ్డి గ్రామంలో అధికారులు విచారణ జరిపారు. లింబయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడలేదని, అనారోగ్యం వల్లనే మృతిచెందాడని పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. లింబయ్య దంపతులకు ఆసరా ఫించన్ కింద నెలకు 2 వేలు అందుతున్నట్లు అధికారులు నిర్థారించారు. ఇదే విషయాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపర్చి ప్రభుత్వానికి పంపారు. లింబయ్య అనారోగ్యంతో మృతి చెందితే...అప్పుల భారంతో మృతిచెందినట్లుగా వార్తలు వచ్చాయని భావించిన కేసీఆర్...ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతు బలవన్మరణానికి పాల్పడకుండా నివారించేందుకు, వారిలో మనోధైర్యం నింపే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైతన్నలు ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. పంట రుణాల వడ్డీ విషయంలో కూడా బ్యాంకులను మందలించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more