గుజరాత్ లో ఉంటున్న బలమైన సామాజిక వర్గం పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలనే డిమాండ్ తో ఉద్యమించి రాత్రికి రాత్రి సెలబ్రెటీగా మారిన హార్దిక్ పాటిల్ మీద కేసు నమోదైంది. అక్రమంగా తమ క్యాంపస్లో ప్రవేశించి నినాదాలు చేశారని ఉమియా క్యాంపస్ మేనేజర్ మనుప్రసాద్ పటేల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు హార్దిక్ పటేల్పై ఐపీసీలోని 147, 427, 447 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
గుజరాత్ లో ప్రారంభమైన ఓ ఉద్యమం.. తీవ్ర రూపం దాలుస్తోంది. పటేళ్లకు ఓబీసీలో చోటుకల్పించాలని డిమాండ్ చేస్తూ పటేళ్లు చేస్తున్న ఆందోళప మరోరూపం దాల్చనుంది.
గుజరాత్ అసెంబ్లీలో పటేల్ సామాజికవర్గ ఎమ్మెల్యేలతో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ సమావేశం కానున్నారు. ఓబీసీ కోటాలో పటేళ్లకు రిజర్వేషన్ కల్పనపై వారి వైఖరేమిటో తెలుసుకుంటామన్నారు. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న తమ ఆందోళనకు మద్దతు తెలుపుతారా? లేక పార్టీ వైఖరులకు కట్టుబడి ఉంటారా? అన్న విషయం వారిని అడిగి తెలుసుకుంటామని హార్దిక్ పటేల్ వెల్లడించారు. తనతోపాటు వందల మంది మద్దతుదారులు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. 182 స్థానాలు గల అసెంబ్లీలో 35 మందికి పైగా పటేల్ సామాజిక వర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
అయితే ఇప్పటికే తీవ్రమైన పటేళ్ల ఉద్యమం రాజకీయ మద్దతు కూడా కూడగట్టగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలే చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పటేళ్ల రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటానికి హా్ర్దిక్ పాటిల్ మరింత ఉదృతం చేశారని, ఇదే విధంగా రాజస్థాన్ లోని గుజ్జర్లతో కలిసి తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని పటేల్ సామాజిక వర్గం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు గుజరాత్ లో రాజకీయంగా కూడా అడుగులు వెయ్యాలని హార్దిక్ పాటిల్ ఆలోచిస్తున్నారు. అయితే ఈ రోజు ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత హార్దిక్ ఏదైనా సంచనల వార్త వెల్లడిస్తాడా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా అహ్మదాబాద్లో పాస్ నేతలు సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరిక్షణాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసినందువల్లే ఆమోదించలేదని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హింకార్ సింగ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more