పోలీసు గుండా.. గుండా పోలీసులు అంటూ సినిమాల్లో రకరకాల పాత్రల గురించి విని ఉంటాం. పోలీసులే కానీ రౌడీల్లాలా మారి రౌడీల భరతం పడితే అందరం విజిల్స్ వేసి చప్పట్లు కొడతాం.. మరి అదే మాదిరిగా నిజ జీవితంలో పోలీసులు రౌడీలుగా మారితే ఎలా ఉంటుంది. కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేస్తే ఎలా ఉంటుంది.. కారు అద్దాలతో పెద్ద పెద్ద రాల్లతో ధ్వసం చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇదే సీన్ రియల్ గా జరిగింది. పోలీసులు రౌడీలలా రాళ్లు, రాడ్ లు, పెద్ద పెద్ద కర్రలు పట్టి వీరంగం సృష్టించారు. కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేశారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా వస్తువులను నాశనం చెయ్యడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చెయ్యడం సర్వాత్రా చర్చకు తెర తీసింది. సీసీటివీ పుటేజి పోలీసుల తీరును ఆధారాలతో సహా బయటపుట్టేశాయి. అయినా ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? గుజరాత్ లో. అవును నరేంద్ర మోదీ గారి సొంతం రాష్ట్రం గుజరాత్ లోనే జరిగింది.
గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గం.. తమకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలని గత మూడు నాలుగు రోజుల నుండి తమ ఆందోళనలను మరింత ఉదృతం చేశారు. అయితే నిన్న గుజరాత్ బంద్ కు పిలుపునివ్వడం.. బంద్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం జరిగిపోయాయి. అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు హింసాత్మక ఘటనలు ఎక్కడ జరిగాయి.. ఎలా జరిగాయి అన్న దాని మీద మార్దిక్ పటేల్ అనుచరులు పటేల్ కోటా వార్ అనే పేరుతో ట్విట్టర్ లో ఓ పేజీని క్రియేట్ చేసి.. దానిలో ఓ వీడియోను ఉంచారు. ఆ వీడియోలో పోలీసులు ఆస్తులను ధ్వంసం చెయ్యడం కనిపించింది. అయితే పోలీసులు రౌడీల్లా మారి విధ్వంసాన్ని సృష్టించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా చేశారు..? ఎవరి కోసం ఇలా చేశారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
*అబినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more