పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఒకరిని చూసి మరొకరు కాపీ కొడుతున్నారు. రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను చూసి అందరూ అవాక్కయ్యారు. అయితే అదే అభిమానం తమ మీద కూడా చూపిస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ తాజాగా మరో నేత కూడా అక్కడికి పర్యటనకు వెళుతున్నారు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలె కానీ పక్కవాడిని చూస్తే మాత్రం ఎలా వస్తుంది చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ తన పర్యటనలతో, ఓదార్పు యాత్రలతో బోర్ కొట్టించిన జగన్ తాజాగా పవన్ బాటలో నడవాలని డిసైడ్ అయ్యారు. రాజధాని కోసం రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జగన్ సీఆర్డీఏ పరిధిలో ధర్నాకు రెఢీ అయ్యారు. మరోవైపు... రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాటం లేదని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ నెల 25, 26న వరుస ధర్నాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది.
అవనిగడ్డనియోజకవర్గంలోని కొత్త మాజేరులో విషజ్వరాల బారినపడిన ప్రజలను జగన్ ఈనెల 4న పరామర్శించారు. వారంరోజుల్లో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అయితే.. 20రోజులైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 25న మచిలీపట్నం కలెక్టరేట్ ఎదట ధర్నా చేయాలని నిర్ణయించారు. రాజధాని కోసం భూసేకరణపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను బలవంతంగా లాక్కోవడం తప్పుబట్టారాయన. రైతులకు న్యాయం చేసేందుకు వైసీపీ చివరి వరకు పోరాడుతుందని భరోసా ఇస్తోంది వైసీపీ.ఇప్పటికే సేకరించిన భూమి రాజధాని నిర్మాణానికి సరిపోతుందని తెలిపింది వైసీపీ. ఇంకా అవసరమైతే... ప్రభుత్వ భూములను ఉపయోగించుకోవాలని సూచించింది. 33 వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... ఇప్పుడు భూసేకరణకు వెళ్లటం సరికాదంటోంది వైసీపీ. రైతులకు అండగా సమీక్షలు, పాదయాత్రలు చేసిన వైసీపీ మరోసారి ప్రజల పక్షాన నిలిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు తుళ్లూరు. మంగళగిరి, ఉండవల్లి, పెనుమాక, కురగల్లు, నిడమర్రులో జగన్ పర్యటించి రైతులకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది వైసీపీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more