ప్రొకబడ్డీ రెండో సీజన్లో యు ముంబ జట్టు విజేతగా నిలిచింది. 14 లీగ్ మ్యాచ్లలో 12 విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన ముంబై జట్టు ఫైనల్లో కూడా అదేజోరును కొనసాగించింది. బెంగళూరుతో నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో ఒత్తిడిని జయించి 36-30 తేడాతో విజేతగా నిలిచిందిగతేడాది చేజార్చుకున్న ట్రోఫీని ఈసారి ఒడిసిపట్టుకుంది. దీటైన రైడింగ్కు పటిష్ఠ డిఫెన్స్ తోడైన వేళ ముంబై జట్టు 36-30 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్పై అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఫైనల్ చేరడంలో విఫలమైన తెలుగు టైటాన్స్ జట్టు చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకుంది. హోరాహోరీ: అనుభవజ్ఞుడైన కెప్టెన్ అనూప్కుమార్ సారథ్యంలో సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన ముంబై మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడుకుంటూ వచ్చింది. షబ్బీర్ బాపు(9పాయింట్లు), కెప్టెన్ అనూప్కుమార్(6)ల రైడింగ్తో తొలి అర్ధభాగం ముగిసేసరికి ముంబై 16-8తో ఆధిక్యంలో నిలిచింది.
అయితే సెకండాఫ్ ఆట 33వ నిమిషంలో బెంగళూరు స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుత రైడింగ్తో ముంబైని ఆలౌట్ చేసి ఐదు పాయింట్లు కొల్లగొట్టాడు. దీంతో ఇరుజట్ల స్కోరు 23-23తో సమమైంది. అయితే షబ్బీర్బాపు రైడింగ్లో మూడు పాయింట్లతో ముంబై ఒక్కసారిగా 29-24తో ముందుకెళ్లింది. ఈ దశలో బెంగళూరు కెప్టెన్ మంజీత్చిల్లార్ రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 25-30కు తగ్గించాడు. ఇక మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా రైడింగ్కొచ్చిన కెప్టెన్ అనూప్ బెంగళూరును ఆ లౌట్ చేసి మూడు కీలకపాయింట్లు సాధించడంతో ముంబైకు చిరస్మరణీయ విజయం దక్కింది. అంత కుముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 34-26 తేడాతో పాట్నా పైరేట్స్పై ఘనవిజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more