ఏపి రాజధాని అమరావతి కోసం కావాల్సిన భూమిని సేకరించేందుకు ఏపి సర్కార్ సిద్దమవుతోంది. గతంలో ల్యాండ్ పూలింగ్ కు రైతులకు అవకాశం ఇచ్చిన ఏపి సర్కార్ అందులో భూములు ఇవ్వని రైతుల నుండి ఎలాగైనా సరే భూములను తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపి రాజధాని అమరావతికి మరో మూడు వేల ఎకరాల స్థలం అవసరం. కాగా ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మాటల తూటాల మధ్యనే ఇవాళ్టి నుంచి భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 26మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రత్యేక అధికారులను కట్టబెట్టింది ప్రభుత్వం.. మరోవైపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలుస్తానని పవన్ స్పష్టం చేశాడు.. దీంతో ఈ రభస పొలిటికల్గా ఏ టర్న్ తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది..
ఇప్పటికే 33 వేల ఎకరాల సమీకరణ పూర్తైంది.. 3 వేల ఎకరాల దగ్గర పీటముడి పడింది.. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సర్కార్కు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది.. ల్యాండ్ పూలింగ్ ద్వారానే 90 శాతం మంది రైతులతో ఒప్పందం చేసుకుంది సర్కార్.. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేది లేదన్నారు.. ఏడాదికి నాలుగు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వం ఏ స్థాయిలో సంప్రదింపులు జరిపినా రైతులు వెనక్కితగ్గలేదు.. దీంతో ఇవాళ్టి నుంచి భూసేకరణ చట్టం అమలుకు సిద్ధమైంది ప్రభుత్వం..
భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 26 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది.. భూ సేకరణకు ప్రత్యేక అధికారాలను కట్టబెడ్తూ జీఓ 304ను విడుదల చేశారు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి.. ఇదిలా ఉంటే భూసేకరణ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు సీఆర్డీఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు.. భూసేకరణ చేపట్టొద్దని ట్విట్టర్ వేదికగా ఇప్పటి వరకు ఏపీ సర్కార్ను రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు పవన్.. అంతేకాదు త్వరలోనే భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసేందుకు కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.. ఐనా ప్రభుత్వం మాత్రం భూసేకరణకు సిద్ధమైపోయింది.. మరి భూసేకరణ చట్టం ద్వారా భూములను రైతుల నుండి స్వాధీనపరుచుకోవాలని చూస్తున్న ఏపి సర్కార్ ప్రయత్నం ఫలిస్తుందో లేదా ప్లాన్ రివర్స్ అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more