మీ పిల్లలు కూడా ప్రభుత్వం పాఠశాల్లో చదవాల్సి వస్తుంది. అలాగని ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ విషయం ఏంటి అంటే మహబూబ్ నగర్ జిల్లా అమరచింతలో పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థులు లేఖలు రాశారు. దానిని సుమోటోగా తీసుకున్న హైకోర్ట్ విచారణ ప్రారంభించింది. విద్యాశాఖ కమిషనర్ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తారా? అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్ హైకోర్టు మాదిరిగా ఆదేశాలు జారీచేయాలా? అని ప్రశ్నలు గుప్పించింది. విద్యార్థుల సమస్యలు తీర్చకుంటే, విద్యాశాఖ అధికారుల తీరు మారకుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని మేమూ ఆదేశాలు జారీచేయాల్సివస్తుంది అని ధర్మాసనం హెచ్చరించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వాటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యలతో కూడిన వివరాలను తమకు పది రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. తమకు లేఖలు రాసిన విద్యార్థుల పాఠశాలల అటెండెన్స్ రిజిస్ట్రర్లు సైతం తమకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరంటూ మహబూబ్నగర్ జిల్లా రెండు మండలాలకు చెందిన ఏడు పాఠశాలల విద్యార్థులు రాసిన లేఖల్లో వాస్తవాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవకుమార్ హైకోర్టుకు తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలను చేపట్టిందని, కొందరు టీచర్లను అక్కడికి బదిలీ చేసిందని తెలిపారు. టీచర్ల సంఖ్యపై విద్యార్థుల లేఖల్లో రాసిందానికి, ఈ వివరాలకు తేడాలున్నాయని పేర్కొంది. ఆ ఏడు పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల హాజరుపట్టికలను పదిరోజుల్లోగా తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాకమిషనర్ కోర్టుకు హాజరైన విషయం తెలుసుకున్న ధర్మాసనం..ఆయన తన పిల్లలను ఇలాంటి పాఠశాలల్లోనే చదివిస్తారా? అని ప్రశ్నించింది. ఉన్నతస్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే కానీ విద్యార్థ్ధుల సమస్యలు మీకు అర్థం కావని వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ మధ్యే అలహాబాద్ హైకోర్ట్ కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని.. ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పిల్లలు కూడా స్థానిక ప్రాధమిక పాఠశాల్లోనే చదవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలహాబాద్ కోర్ట్ తీర్పును సగటు భారతీయుడు ఎప్పటి నుండో కోరుకుటంన్నారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అది జరగడం లేదు. ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల మీద చూపుతున్న నిర్లక్షం, అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దేశంలో ఉన్నతమైన న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేస్తే కానీ పరిస్థితి మెరుగుపడేలా లేదు మరి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more