అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోస్తా, సీమాంధ్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు సాగుకు మంచి అవకాశమని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోగా, పలు పల్లెలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. రాజమండ్రి పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్, రైల్వేస్టేషన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
అటు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. బుట్టాయిగూడెం మండలం కొండవాగులో వరద నీటు ఉధ్దృతి అధికమవ్వడంతో ఆరుగురు కొట్టుకుపోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాధఛాయలు అలుముకున్నాయి. గల్లంతు అయినవారిలో ముగ్గురు మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. జిల్లాలో బుట్టాయిగూడెం మండలంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంది. భక్తులు ప్రతి గురువారం, ఆదివారం ఈ గుడికి వస్తుంటారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా గుడివాడ మండలం అన్నవరప్పాడుకు చెందిన ఒక కుటుంబం ఈ గుడికి వచ్చారు. ఈ గుడి సమీపంలో కొండవాగు ఉంది. ఆ కొండవాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సరస్వతి, కళ్యాణి, రమేష్లుగా గుర్తించారు. మరో ముగ్గురు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more