హైటెక్ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్ మీడియాను మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఫేస్ బుక్ లో సీఎంఓ పేజీకి భారీగా లైక్ లు కూడా వస్తున్నాయి. వివిధ సమస్యలపై మీడియాలో ఏమైనా పోస్టులు వస్తుంటే.. సీఎం కార్యాలయ సిబ్బంది వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. టెక్నాలజీని ప్రమోట్ చేయడంలోనే కాదు.... వినియోగించటంలోనూ ముందంజలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇ-ఆఫీస్, ఇ-కేబినెట్..ఇలా అన్ని వ్యవస్థలను ఆన్లైన్ చేస్తున్న సీఎం చంద్రబాబు... ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం కూడా టెక్నాలజీని అదేవిధంగా వాడుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫేస్బుక్లో సీఎం చంద్రబాబు కార్యక్రమాలకు ఓ ప్రత్యేక పేజీని క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంఓ పేరుతో ఉన్న ఈ పేజీకి భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను, చంద్రబాబు సందేశాలను ఈ పేజీద్వారా మినిట్ టు మినిట్ అపడేట్ చేస్తున్నారు.
ఇక.. ఫేస్బుక్లో ప్రభుత్వ అపడేట్స్కు సంబంధించి ప్రతిరోజు ఉదయం సీఎం చంద్రబాబు పలు సూచనలు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమ్ సీఎం కార్యాలయంలో పనిచేస్తోంది. ఫేస్ బుక్ పేజీలో వచ్చే కామెంట్స్, సమస్యలను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్ళటం ...వాటిపై చర్చించి పరిష్కారం చూపించే బాధ్యతను కూడా ఈ టీమ్ తీసుకుంటోంది. ఇక.. ప్రభుత్వం తరపున చేస్తున్న ఒక్కో పోస్ట్కు వేల సంఖ్యలో లైక్లు వస్తున్నాయి. సీఎం ఫేస్ బుక్ పేజీని రెగ్యులర్ గా 36 వేల మంది ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. మనదేశంతో పాటు ఇతర దేశాల వారు కూడా సీఎం ఫేస్ బుక్ పేజీని ఫాలో అవుతున్నారని వారు వివరించారు. ఫేస్ బుక్ లోనే కాదు ట్విట్టర్ లో సైతం ఏపీ సీఎంఓ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సూచనలు, సలహాలు అందుతుండడం సంతోషంగా ఉందని అధికారులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more