ap | special status | Raghuveera Reddy

Ap pcc president raghuveera reddy slamed nda govt

ap, special status, Raghuveera Reddy, Congress, AP bund, NDA govt

AP PCC president Raghuveera Reddy slamed NDA govt. He said that the central govt did mistakes but now its searching for reasins on special status for the state of ap issue.

కేంద్రం తప్పు చేసి కారణాలు వెతుకుతోంది

Posted: 08/11/2015 03:31 PM IST
Ap pcc president raghuveera reddy slamed nda govt

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పు చేసి కారణాలు వెతుక్కుంటోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్త బంద్‌కు వామపక్షాలు పిలుపు ఇచ్చిన మేరకు కృష్ణా జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. విజయవాడలో జరుగుతున్న బంద్‌లో పాల్గొన్న రఘువీరారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయడవాడలో కూర్చున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు.మొత్తానికి నేడు చేపడుతున్న ఏపి బంద్ శాంతియుతంగా జరుగుతోంది.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్‌ రూ. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులను, హోదాతోపాటు పోలవరం, రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవన్నీ కోరడం జరిగిందని రఘువీరారెడ్డి తెలిపారు. దానికంటే ఎక్కువ చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మోదీతో చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాటను అమలు పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం, మంత్రులు, ఎంపీలు అందరూ ఢిల్లీలో కూర్చుని హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన అన్నారు. మేము ప్రజా పోరాటాలు చేస్తామని, మీరు ప్రత్యేక హోదా సాధించుకురావాలని రఘువీరారెడ్డి సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  special status  Raghuveera Reddy  Congress  AP bund  NDA govt  

Other Articles