ఢిల్లీలో ఓ ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సు అకాడమీలో చోర కళను నేర్సిస్తున్నారు. ఔరా..! అనిపించేలా వున్న ఇది నిజం. దేశ రాజధాని డిల్లీలో రేపటి తరానికి ఇంగ్లీషుతో పాటు చోర కళలో కూడా సిద్దహస్తులను చేస్తున్నారు. అంతేకాదు ప్రాకికల్స్ నిర్వహించి మరీ ప్రావిణ్యాన్ని సంపాదించారా..? లేదా..? అని పరీక్షిస్తున్నారు. కేవలం రెండు వారాల్లోనే దొంగతనం చేయడంలో నిష్ణాతుల్ని చేస్తారు. ఇంతకీ ఈ అకాడమీ డైరెక్టర్ ఎవరా అంటరా..? యూపీలోని ఖరగ్పూర్కు చెందిన రాజీవ్ సహాని ఓ దొంగతనం కేసులో 2011లో జైలుకెళ్లాడు. అక్కడే తోటి ఖైదీ నుంచి ఏటీఎంను చోరీ చేయడం ఎలా అనే విషయంపై తర్ఫీదు పొందాడు. అక్కడ నుంచి బయటకొచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం ప్రారంభించాడు.
అయితే ఈ పని ఒక్కడే చేయడం కష్టమయ్యేది. అందుకే ‘రెండు వారాల్లో ఇంగ్లీష్ నేర్పిస్తా’ అంటూ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో చురుకైన విద్యార్థులను దొంగతనం వైపు మళ్లించాడు. తొలుత క్లాస్లో థియరీ బోధించి, అనంతరం వారిని ఏటీఎంల వద్దకు తీసుకెళ్లి ప్రాక్టికల్స్ కూడా చూసి చూపించేవాడట. ఏటీఎంల వద్దకు వచ్చిన నిరక్షరాస్యులను, వృద్ధులకు సహాయం చేస్తామని చెప్పి వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ పిన్ను కీప్యాడ్లో పెడతారు. దాంతో స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏటీఎం పనిచేయడం లేదు, మరో చోటుకి వెళ్లండని చెబుతాడు. వారు వెళ్లగానే.. ఆ పిన్నునా తీసేసి డబ్బుల తీసుకుంటారు. ఇదే వారి ప్రణాళిక.
ఇలా చోరీలు చేస్తూ అతను భారీగా డబ్బులు కూడబెట్టాడు. సభ్యులకు కూడా భారీగా వాటాలు ఇవ్వడం మొదలెట్టాడు. జేబులో రూపాయి లేకుండా తిరిగిన రాజీవ్.. కొద్ది రోజులకే హోండా సిటీ కారులో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇది ఎంతో కాలం కొనసాగలేదు. కంప్లైంట్లు ఎక్కువవడంతో పోలీసులు నిఘా వేశారు. దీంతో అతను అరెస్టయి ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నాడో.. అక్కడికే చేరుకున్నాడు. మరి ఈ సారి జైలుకెళ్లిన మాస్టారు.. మరే విద్యలో నైపుణ్యం సాధించుకుని వస్తారో..? అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తారో.. నిఘా పెట్టాల్సిన అవసరం వుంది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more