ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన పోరు సభలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్న ఆయన కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ తరహా ఘటన చోటుచేసుకున్న నేపత్యంలో ఏపీ పిసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పనికిరారని అర్థమవుతుందని విరుచుకుపడ్డారు.. రఘువీరారెడ్డి చేతకాని తనం వల్లే తిరుపతి ఘటన జరిగిందని విమర్శించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు భాద్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పూర్తి భాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు ఉద్రేకాలకు లోనుకావద్దని ఆయన సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు టీడీపీ కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మరో మాటకు తావులేదని సోమిరెడ్డి ఉద్ఘాటించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశమై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ప్రత్యేక హోదాను బిల్లులో చేర్చిఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారు కేఈ ధీమా వ్యక్తం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more