విదేశీ పెట్టుబడి దారులు వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో నెస్ట్లీ వంటి ప్రతిష్మాత్మక కంపెనీల ఉత్పదనలను ఎలాంటి రభస చేయకుండా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను ఆదేశించారని స్వయంగా కేంద్ర పౌరశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రకటించిన రెండు రోజుల్లో నెస్ట్లీ కంపెనీ ఉత్పాదన మ్యాగీ నూడుల్స్ ప్రజారోగ్యానికి విఘాతం కలిగించేలా వుందని మరోమారు వెల్లడైంది. బిజేపి పాలిత రాష్ట్రం గోవాలో మ్యాగీ శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్షించామని.. అవి తినడానికి సురక్షితమేనని వెల్లడైందని, ఈ నేపథ్యంలో బ్యాన్ విధింపుపై పునరాలోచనలో వున్నామని కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించిన వివరాలను సందిగ్ధంలోకి నెడుతూ తాజా ఫలితాలు వెల్లడయ్యాయి.
తాజాగా, మ్యాగీ శ్యాంపుల్స్ సురక్షితం కాదని మరో ల్యాబ్ పరీక్షలో తేలింది. మ్యాగీ శాంపిల్స్ను ల్యాబ్లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడారని తేలినట్టు శనివారం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ నిర్ణయించిన మోతాదుకన్నా సీసం మోతాదు ఎక్కువగా ఉందని ఆ అధికారి తెలిపారు. మ్యాగీ శాంపిల్స్ను పరీక్షించిన ల్యాబ్ రిపోర్టులను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థకు పంపనున్నట్టు అడిషనల్ కమిషనర్(ఫుడ్) మౌర్యా పేర్కొన్నారు. సీసం, మోనోసోడియం గ్లుటామేట్ మోతాదుకు మించి వున్నాయన్న కారణంగానే కేంద్రం మ్యాగీపై జూన్ 5న నిషేదం విధించిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more