ముంబై వరుస పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ను ఉరితీతపై బాలివుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యాలపై దేశవ్యాప్తంగా నిరసన సెగలు పెల్లుబిక్కడంతో వెనక్కి తగ్గారు. యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేసిన సల్మాన్ ఖాన్ తన తప్పును సరిదిద్దుకున్నారు. ఈ కేసులో అసలు దోషి యాకూబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్ అంటూ వ్యాఖ్యానించిన ఆయన అసులు దోషి టైగర్ మెమన్ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటుంటే.. ఆయనను పట్టుకుని ఉరికంభం ఎక్కించే బదులు.. నిరపరాధి అయిన టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ ఉరితీయడంపై అక్షేపనీయమన్న సల్మాన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
సల్మాన్ చేసిన ట్వీట్లపై సొంత తండ్రి నుంచే విమర్శలు రావడంతో తాను చేసిన ట్వీట్లను వెనక్కు తీసుకున్నారు. తనవల్ల ఎదైనా తప్పు జరిగితే క్షమించాలని కోరారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. యాకుబ్ అమాయకుడని, అతడిని ఉరితీస్తే మానవత్వాన్ని ఉరితీసినట్లేనంటూ సల్మాన్ వరుస ట్వీట్లు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా జైలులో గడిపిన యాకుబ్ ఈ నెల 30న ఉరికంబం ఎక్కనున్నారు. రేపు సుప్రీంకోర్టులో యాకుబ్ మెర్సీ పిటీషన్పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి 30న యాకుబ్ ఉరి ఉంటుందా లేక వాయిదా పడుతుందా అన్నది తేలనుంది.
1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 250 మంది అమాయక ప్రజలు చనిపోయిన కేసులో దోషులను సల్మాన్ ఖాన్ వెనకేసుకురావడంపై పలు పార్టీలు మండిపడ్డాయి. సల్మాన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. పార్లమెంట్లో రేపు సల్మాన్ వ్యవహారాన్ని లేవనెత్తుతానని బిజెపి ఎంపీ కిరీటీ సోమయ్య తెలిపారు. సల్మాన్ న్యాయస్థానం తీర్పును తప్పుబడుతున్నారా అని శివసేన ప్రశ్నించింది. ఎన్సీపీ కూడా సల్మాన్ వైఖరిని తప్పుబట్టింది. న్యాయస్థానం తీర్పులను ప్రశ్నించరాదని సూచించింది..
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more