ఆమె కడు పేదరాలు. తనకు తెలియకుండానే తన ఖాతాలో మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 95 వేల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆమెను ఏకంగా ప్రపంచ ధనవంతురాలల్లో ఒకరిగా మార్చింది. అదేలా సాధ్యమంటారా..? కానీ ఇది నిజం. అమె ఖాతాలో అంత డబ్బు ఎలా వచ్చిందో అమెకు తెలియదు. అందుచేతే అమె తన ఖాతాలోని డబ్బు చూసి ఆశ్చర్యానికి గురైంది. తాను ఈ విషయాన్ని నమ్మలేకపోతునాన్నిని చెప్పేంత లోపే ఆ డబ్బు ఎలా వచ్చిందో ఆలా మాయమయ్యింది. మీరు కూడా విస్మయానికి గురవుతున్నారా..? ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ బ్యాంకు సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే అంటే నమ్మగలరా..?
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్కి చెందిన ఊర్మిళా యాదవ్ అనే మహిళ కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్ ధన్ యోజన’ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచింది. అందులో రెండు వేల జమ చేసింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్కు రెండు మెసేజ్లు వచ్చాయి. అందులో మొదటిది 9,99,999 మీ అకౌంట్లో జమయ్యాయి అని, రెండోది అందులోంచి 9.7 లక్షలు డెబిట్ కావడంతో రెండు వేలు ఉన్నాయి అని మేసేజ్లు వచ్చాయి. ఆశ్చర్యపోయిన ఆమె బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది. దీంతో ఆమె ఖాతా తనిఖీ చేయగా ఆమె ఖాతాలో 9,571,16,98,647.14 మొత్తం ఉన్నట్టు తేలింది.
బ్యాంకు అధికారులు కూడా సరిగ్గా పలకలేకపోయిన ఆ మొత్తం చూసి ఊర్మిళకు గుండెపోటు వచ్చినంత పని అయింది. అయితే ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ వివరణ ఇచ్చారు. ఊర్మిళ ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం లేదని, దాంతో ఆమె ఖాతాలో 95 వేల కోట్లు జమ చేసి తర్వాత దానిని తీసేశామని తెలిపారు. కాగా, ఖాతాదారుడికి తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఆ అకౌంట్లో నుంచి డబ్బుల తీయడం, వేయడం చేయకూడదన్నది బ్యాంకు నిబంధన. దీంతో ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more