చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపబడుతున్న రాజధాని ‘అమరావతి’ నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. మూడు మండలాలు, 29 గ్రామాల పరిధిలో రాజధాని ఆవిష్కరణకు సర్వం సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్తో పాటు పలు వ్యాపారాల జోరు బాగానే పెరిగింది. విదేశాల్లో పేరుగాంచిన కొన్ని కంపెనీలు సైతం తమ సంస్థల్ని రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ షోరూంల శాఖలను తెరిచేశాయి కూడా. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రకటించినప్పటి నుంచి అక్కడ సందర్శకుల రాకపోకలు పెరిగాయి. ఇక మారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్లు తమ శాఖలను ప్రారంభించాయి.
ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ నయా రాజధానిని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆవిష్కరణకు సిద్ధమవుతున్న కొత్త రాజధానిలో ఇప్పటికి సరైన నెట్వర్క్ లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రాజధాని ప్రాంతంలో కొత్త కొత్త హోటళ్లు వెలుస్తున్నాయి.. రోజు రోజుకు ఖరీదైన కార్లు పెరుగుతున్నాయి.. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగిపతున్నాయి కానీ.. అక్కడ అనేక గ్రామాల్లో ఏ మొబైల్ ఫోన్ పని చేయని పరిస్థితి ఇంకా నెలకని వుంది. ముఖ్యంగా తుళ్ళూరులో బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఫోన్లు సైతం మొరాయిస్తున్నాయంటే.. అక్కడ పరిస్థితి ఎలా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ రాజధాని ప్రాంతాన్ని పర్యటిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు అక్కడ అనేక గ్రామాల్లో సెల్ఫోన్లు పని చేయకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇదిలావుండగా.. అక్టోబర్లో రాజధానికి శంకుస్థాపన చేయటానికి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడికి వస్తున్నారు. అప్పటివరకైనా సెల్ కంపెనీలు స్పందించి సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తారో లేదో వేచి చూడాల్సిందే! మానవ జీవితంలో నిత్యవసరంగా మారిన సెల్ ఫోన్ల సర్వీసులు రాజధాని ప్రాంతంలో సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more