ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు మనస్తాపానికి గురయ్యారు. కేంద్ర మంత్రి పదవికి తాను రాజనీమా చేస్తానని చెప్పడమే కాదు ఏకంగా అందుకు సిద్దమయ్యారు కూడా. దీంతో ఆయనను చల్లబర్చే బాద్యతను చంద్రబాబు తీసుకుని సముదాయించారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరగడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి కేటాయించిన నిధుల విడుదల కూడా ఆలస్యమవుతోందని చెప్పారు. దాంతో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, తాను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని బదులిచ్చారు. ‘‘మీది స్వతంత్ర శాఖ. రాష్ట్రానికి రావలసిన నిధులను మాట్లాడి తెచ్చుకోవాలి కదా’’ అని బాబు అన్నారు. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ పనులను వేగంగా చేస్తున్నామని, భోగాపురం విమానాశ్రయం రావడానికి కూడా తాను కృషి చేశానని అశోక్ చెప్పారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూసేకరణలో జాప్యం తప్ప వేరే కారణం లేదని వివరించారు.
అదే సమయంలో, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల విషయంలో మనం ఏమీ చేయలేకపోతున్నామని ఒకరిద్దరు ఎంపీలు వ్యాఖ్యానించారు. దాంతో, పేరుకు తనది స్వతంత్ర శాఖే అయినా ప్రతి ఫైలు ప్రధాని పేషీకి వెళ్లాల్సిందేనని మంత్రి అశోక్ చెప్పారు. శాఖాపరంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పీఎం పేషీలో అధికారులు అనేక కొర్రీలు వేస్తుంటారని, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. దాంతో, ‘‘పనులు వేగంగా అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి. చేయాల్సిందంతా చేస్తే ప్రజల నుంచి విమర్శలు రావు కదా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దీనిపై, ‘‘మీరు నా పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే తొలగించండి సార్. మీకు ఇబ్బంది అనుకుంటే రేపు తొలి గంటలో రాజీనామా చేసి రాష్ట్రపతికి అందజేస్తా’’ అంటూ సున్నిత మనస్కుడైన అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించడంతో ఎంపీలు బిత్తరపోయారు. చిరుజల్లులా మొదలైన వాతావరణం జడివానగా మారడంతో చంద్రబాబు టాపిక్ మార్చి పరిస్థితిని చల్లబరిచారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ.. చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనా, ఎంపీలు హాజరైన ఇఫ్తార్ విందులో కూడా ఆశోక గజపతిరాజు పాల్గొనలేదు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more