అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. అమెరికాలో పన్ను చెల్లింపు దారులను టార్గెట్ గా చేసుకుని ఇండో అమెరికన్ భారీ రెవెన్యూ కుంభకోణానికి పాల్పడ్డాడు. పన్ను చెల్లింపు దారులను బెదిరించి దాదాపు రూ.126 కోట్ల(20 మిలియన్ డాలర్లు)కు పైగా వసూలు చేశాడు ఈ ఆర్థిక నేరగాడు. ఎట్టకేలకు తాను చేసిన మోసం భయట పడటంతో.. ఈ కుంభకోణం సూత్రధారి షాహిల్ పటేల్ ను అమెరికా పోలీసులు న్యాయస్థానం ముందు నిలబెట్టారు. న్యాయస్థానంలో తాను చేసిన మోసాన్ని అంగీకరించిన నిందితుడికి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
కేసులో పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అల్విన్ కె హెలెర్స్టీన్.. కుంభకోణం 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.6.3 కోట్ల(1 మిలియన్ డాలర్ల) జరిమానా విధించారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న తతామీలో నివసిస్తున్న భారత్కు చెందిన సాహిల్ పటేల్(36).. భారత్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అక్కడ అందరినీ మహిళలలనే ఏర్పాటు చేసి.. వారితో ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. భారత్ నుంచి ఇంటర్ నెట్ అనుసంధానంతో ఫోన్ కాల్స్ చేసి.. ఆ నెంబర్లు ఎఫ్.బి.ఐ లేదా మన్ హట్టన్ లోని ఫెడరల్ కార్యాలయం నెంబర్లతో సరిపోయేలా వుండేట్లు చేసుకుని పన్ను చెల్లింపుదారులను బెదిరించేవారు.
తమను తాము ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్) ఏజెంట్లుగా పేర్కొంటూ పన్ను చెల్లింపుదారులను బెదిరించి డబ్బులు రాబట్టారు. పలువురికి ఈ ఫోన్ కాల్స్ విషయంలో సందేహాలు కలిగినా.. అవి ఎఫ్ బిఐ అధికారుల ఫోన్ నెంబర్లతో సరిపోలడంతో వారు మిన్నకుండి.. తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందనుకుని సాహిల్ పటేల్ వలలో పడిపోయారు. 2011 డిసెంబర్ నుంచి 2013 డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులను బెదిరించిన ఈ ముఠా ముఖ్యంగా ఐదు రాష్ర్టాల్లోని ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడింది. అమెరికా టాక్స్ ఏజెన్సీ చరిత్రలో అతిపెద్దదని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more