వ్యాపమ్ కేసులో పరిశోధనాత్మక కథనాలకు పేరుపొందిన జర్నలిస్టు అక్షయ్సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారం రోజుల తరువాత వ్యాపం కుంభకోణంపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో అక్షయ్ సింగ్ . మృతిపై అనుమానాలు వ్యక్తమైమయ్యాయి. అక్షయ్ సింగ్ తన కన్నా గోప్పవాడా అంటూ క్యాబినెట్ మంత్రులు నోరు జారారు కూడా. ఆ తురువాత నాలుక కరుచుకుని లేదు లేదు జోక్ చేశామని తమ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కూడా. దీంతో అక్షయ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంఘీభావంగా మధ్యప్రదేశ్ లోని విపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు.
ఈ తరుణంలో ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పరామర్శించారు. అక్షయ్సింగ్ నివాసానికి వెళ్లిన చౌహాన్ అక్కడ కొంతసేపు ఉన్నారు. అక్షయ్ తల్లిని, సోదరిని ఓదార్చారు. అక్షయ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మధ్యప్రదేశ్ భవన్లో అక్షయ్ సోదరికి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చెప్పారు.
అయితే శివరాజ్ సింగ్ ఇచ్చిన తాయిలాన్ని జర్నలిస్టు కుటుంబసభ్యులు మూకుమ్మడిగా తిరస్కరించారు. నితీ, నిజాయితీకి కట్టుబడి తమ బిడ్డ.. చీకటి మయమవుతున్న నిజాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం తప్పా..? మా బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ వారు తమ అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తమకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే.. తమ బిడ్డ హత్యోందంపై నిష్ఫక్షపాత విచారణ జరిపించాలని వారు ముఖ్యమంతిని శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు.
నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు
ముఖ్యమంత్రి పదవికి ఎట్టి పరిస్థితుల్లో తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వ్యాపమ్ స్కామ్ను బయటపెట్టి విచారణకు ఆదేశించింది తానే అని ఆయన చెప్పుకున్నారు. ఎన్నికల్లో గెలవలేని కాంగ్రెస్ తనపై కక్ష్య పెంచుకుని...మధ్యప్రదేశ్నే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అంటే స్కాముల ప్రదేశ్ అని ప్రచారం జరగడం అన్యాయమన్నారు. వ్యాపమ్ స్కామ్కు సంబంధించి ప్రతీ మరణంపైన విచారణ జరగాలని శివరాజ్ ఆకాంక్షించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more