న్యాయ వ్యవస్థలో అందరికి న్యాయం జరుగుతుంది.. అయితే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి అన్యాయం అనిపిచవచ్చు. కానీ దేశ న్యాయవ్యవస్థ మీద ఎంతో మందికి చాలా నమ్మకం ఉంది. అయితే న్యాయ వ్యవస్థ మీద కొంత మంది రాజకీయ నేతలు తెలియక మాట్లాడటం తర్వాత నాలుక్కరుచుకోవడం జరిగింది. కానీ తాజాగా న్యాయ వ్యవస్థలో కీలక పదవిలో ఉన్న అదనపు అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి న్యాయ వ్యవస్థకు సంబిందిన కొన్ని అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది చేసిందో ఎవరో కూడా కాదు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావ్. అయితే అతను చేసిన వ్యాఖ్య మీద తలెత్తే పరిణామాలపై కూడా ముందుగా ఊహించి కూడా వ్యాఖ్యనించడం విశేషం.
న్యాయ వ్యవస్థపై తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సంచలానాత్మక కామెంట్లు చేశారు. బ్రోకర్స్ , పైరవీ కారులు న్యాయ వ్యవస్థలో ఉన్నంత వరకు నేరస్థులు, అవినీతి పరులు, దగాకోరులు పైలా పచ్చీసుగా రోడ్లపై తిరుగుతుంటారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు మండి పడ్డారు. రేవంత్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాన ఏసీబీ సుప్రీ కోర్టులో వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టి వేసిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. తాను ఇలా మాట్లాదుతున్నందుకు కోర్టు ధిక్కరణ కింద నన్ను అరెస్టు చేసినా సరే నిజాలే మాట్లాడుతాను అని అన్నారు. అవసరమైతే రిక్షాతొక్కుతా లేదంటే బెండకాయలు అమ్ముకొని బతుకుతా కాని కాని నిజలు మాట్లాడకుండా ఉండను అని రామ చందర్ రావు అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అన్నది ప్రశ్న. రేవంత్ రెడ్డి కేసు సుప్రీంకోర్ట్ లో నడుస్తున్న కీలక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ప్రాధాన్యతను పొందింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more