ఇండియాలో ఫోర్త్ ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియాని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. మీడియాని అడ్డం పెట్టుకుని డబ్బులను సులువుగా సంపాదించాలన్న ఉద్దేశంతో బడాబాబులను టార్గెట్ చేయడం, వారిని తమ ట్రాప్ లో పడేయడం, తర్వాత బెదిరింపులకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల బృందం తతంగం బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడూ వినని టీవీ చానెళ్ల పేర్లు చెబుతూ ఓ ముఠా.. బడాబాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఈ ముఠాలోని ఓ వ్యక్తి.. సమాజంలో పేరున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు మిస్ట్ కాల్ ఇస్తాడు. తిరిగి వారు ఫోన్ చేయగా.. ఇటువైపు నుంచి ఓ అమ్మాయి మాట్లాడుతుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడమే ఆమె పని. ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆమె తిరిగి పదేపదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. అలా వారి మధ్య ఏర్పడిన ఆ మాటల పరిచయం బేకరీలు, స్టార్ హోటళ్ల దాకా వెళుతుంది. చివరకు సదరు వ్యక్తి, యువతిని సీక్రెట్ గా కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తారు. వారిద్దరు కలిసి లాడ్జికి వెళ్లగానే.. క్షణాల్లో ఆ ముఠా రంగంలోకి దిగుతుంది. వారిద్దరు లోపలి గడియ వేయగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే.. ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఆ వీడియోలను తమ టీవీ చానళ్లో వేస్తామని బ్లాక్ మెయిలింగ్ కి దిగుతారు. రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు.
ఆ ముఠా కెమెరాలను రెండు విధాలుగా అమరుస్తారు. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా వుంటే.. ఆ గదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు కెమెరాల్లో రికార్డ్ అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు. ఇక రెండో విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటుకి అమ్మాయి వెళ్లాల్సి వస్తే.. సీక్రెట్ కెమెరాలతో సిద్ధంగా వుండి గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ ముఠా ఎంట్రీ ఇస్తుంది. ఇలా చిత్రీకరించిన తర్వాత వాటిని తమ చానెళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగి, లక్షల్లో డిమాండ్ చేసి గుంజుతారు. ఇలా వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి ఎన్నో లక్షలు సమర్పించుకున్నాడు. ఇలా ఈ విధగా ఎంతోమంది బడాబాబులను ఆ ముఠా ట్రాప్ చేసి.. కోట్లను పడగెత్తారు. ఈ రకంగానే ఓ వ్యక్తిని ఈ ముఠా ట్రాప్ చేయబోయి.. అడ్డంగా దొరికిపోయింది.
ఆ వివరాల్లోకి వస్తే.. ఈ ముఠా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేసింది. వీరి ప్లాన్ ప్రకారమే.. ఫోన్ చేయడం, అమ్మాయిని పంపండం, మిగిలిన వ్యవహారమంతా పూర్తై.. చివరకు అతగాడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఆ బృందం వ్యక్తులు అతనికి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. అతగాడు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలివిగా తమ మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేసి పెట్టుకున్నాడు. ఇదిలావుండగా.. ఇతని వ్యవహారం గురించి ఓ చానల్ లో స్ర్కోలింగ్ వచ్చింది. అది చూసిన ఇతగాడు పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. శుక్రవారం ఆ ముఠా వ్యక్తుల్ని వరంగల్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more