ఒకప్పుడు మానవులు నూరేళ్లవరకు ఆరోగ్యంగానే జీవించేవారు.. కానీ కాలక్రమంలో మానవుని జీవన విధానంలో మార్పులు రావడంతో అతని కాలపరిమాణం తగ్గుతూ వచ్చింది. ఇక ప్రస్తుతకాలంలో వాతావరణ కాలుష్య ప్రభావం కారణంగా సగటు మానవుడు 60 ఏళ్లు బతకడమే విశేషంగా మారిపోయింది. అయితే.. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన.. వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకపోవడంతోపాటు మరికొంత ఎక్కువ కాలంపాటు జీవించవచ్చునని నిరూపించింది.
ఈ అధ్యయనాన్ని నిర్వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల ప్రకారం.. చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామోటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని తమ పరిశోధనలో వెలువడిన ఫలితం ఆధారంగా వారు పేర్కొంటున్నారు. పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. ఆ ఈగల్లో ట్రామోటినిబ్ డ్రగ్ ను ప్రవేశపెట్టారు. అలా ఔషధాన్ని ప్రవేశపెట్టిన ఈగలను సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువకాలం జీవించాయని తేలింది. ఈ పరిశోధన ఆధారంగా వారు మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
‘ఈగలతోపాటు జంతువులు, మానవుల్లో వుండే ఆర్ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ట్రామోటినిబ్ డ్రగ్ ఆర్ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలుతుంది. తద్వారా వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా మరణాన్ని కొంతకాలంపాటు వాయిదా వేసుకోవచ్చు’ అని ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రాబోయే 10-20 ఏళ్లల పూర్తిస్థాయి చికిత్సా విధానాలు అందుబాటులోకి రాగలవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి.. ఇంకా ఎక్కువకాలంపాటు జీవించాలని ఆశిస్తున్నవారికి ఇది శుభవార్తే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more