అసలే కోతి.. ఆ మీద కళ్లు తాగింది అనే చందాన్ని అందరూ వినే ఉంటారు అయితే దీన్నే ఏపి ప్రభుత్వానికి వర్తించేలా అసలే లోటు బడ్జెట్ ఆ మీద విపరీతమైన ఖర్చులు చేస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం ఏపి ఎలా ఉందో అలా అన్నమాట. అయితే గత కొంత కాలంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న విపరీతమైన ఖర్చు వల్ల ఏపి ఖనానా ఖాళీ అవుతోంది. అయితే గతంలో మోదీ చేసినట్లుగా చేసి ఏపికి పెట్టుబడుల వర్షం కురిపించాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గుజరాత్ చేసిన వైబ్రెంట్ గుజరాత్ తరహాలోనే వైబ్రెంట్ ఏపి కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఏపికి పెట్టుబడులు వస్తాయంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందరూ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తారు. అయితే వైబ్రెంట్ ఏపి పేరుతో ఏకంగా 70కోట్లను ఖర్చుచేస్తుండటమే తాజాగా విమర్శలకు తావిస్తోంది.
ఏపీ వైబ్రెంట్ పేరుతో నిర్వహించనున్న ఓ ఈవెంట్ను చంద్రబాబు ఓ ఆంగ్లపత్రికకు అప్పగించారు. ఈవెంట్ నిర్వహించేందుకు 70 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆదేశించడంతో అధికారులు అవాక్కయ్యారని సమాచారం. గుజరాత్ వైబ్రెంట్ పేరుతో గతంలో నరేంద్ర మోడీ నిర్వహించిన తరహాలో చంద్రబాబు ఏపీ వైబ్రెంట్ ఈవెంట్ నిర్వహించ తలపెట్టారు. బాగానే ఉంది కానీ కరువు కాలంలో విరాళాలు అడుక్కుంటున్న రాష్ట్రప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడమేమిటి? అందులోనూ ఐదు కోట్లకు మించని ఈవెంట్కు 70 కోట్లు ఖర్చు చేయడమేమిటి? ఇంతకీ ఈవెంట్ నిర్వహించడానికి ఒప్పుకున్న ఆ ఆంగ్ల పత్రిక చేసే పనులేమిటో తెలుసా? ఈవెంట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, మీడియాలో ప్రచారం చేయడం, మీడియా మేనేజ్మెంట్ వంటివి మాత్రమే చేస్తుందట. ఈవెంట్కు వచ్చే పారిశ్రామికవేత్తలకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస, సౌకర్యాలు, ఈవెంట్ నిర్వహణకయ్యే ఇతర ఖర్చులన్నీ రాష్ట్రప్రభుత్వమే భరించాల్సి ఉంటుందట. కేవలం బ్రాండింగ్ కోసమే ఆ ఆంగ్లపత్రికకు 70 కోట్లు చెల్లించడమంటేనే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more