పవర్ స్టార్, జనసేనాధిపతి అయిన పవన్ కల్యాణ్ పై ఓ నేత చాలా ఆవేశంగా వున్నారు. నిన్నటివరకు మీడియా ముందుకు రావడానికి కాస్త తడబడిన ఆయన.. ఇప్పుడు పవన్ కోసం ముందుకు వచ్చారు. తాను పవన్ ఇంటికివెళ్లి ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతానని.. అందుకు తగిన సమాధానం ఇవ్వకపోతే ఇంటిముందే బైఠాయించి, నిరసన చేస్తానని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అని అనుకుంటున్నారా! మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు.
మరో రెండు మూడురోజుల్లో తాను పవన్ ఇంటికి వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతానని.. అందుకు తగిన సమాధానం ఆయన ఇవ్వకపోతే ఇంటిముందే బైఠాయిస్తానని వీహెచ్ పేర్కొన్నారు. ఎందుకంటే.. ‘రాష్ట్రంలో ఎక్కడైనా తప్పు, అవినీతి జరిగితే దానిని రూపుమాపేందుకు ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తా’ అని గత ఎన్నికల సందర్భంగా చెప్పిన పవన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. అప్పట్లో ప్రగల్భాలు పలికిన పవన్.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తూ కూర్చుండిపోయారని వీహెచ్ ప్రశ్నించారు.
గతఎన్నికల్లో బాబుకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడు వారి అవినీతిపై స్పందించాలని ఆయన కోరారు. చంద్రబాబు బండారం రేవంత్ రెడ్డి రూపంలో బయటపడ్డప్పటికీ.. ఇంతవరకు ఒప్ప ప్రశ్న కూడా పవన్ వేయలేదని వీహెచ్ ఆరోపించారు. టీడీపీ పాల్పడిన అక్రమాలపై పవన్ స్పందించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ట్విటర్ వేదికగా తాను మరో రెండు రోజుల్లో ‘పోన్ ట్యాపింగ్’, ‘ఓటుకు నోటు’ వ్యవహారాల్లో మాట్లాడుతానని పవన్ పేర్కొన్న సందర్భంలో వీహెచ్ ఈ విధంగా ఆయన మీద విరుచుకుపడటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అటు.. కాంగ్రెస్ నేతలతోపాటు వైకాపా నేతలు సైతం పవన్ ట్వీట్లపై తమదైన శైలిలో కౌంటర్ వేశారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు ఎందుకు నోదు మెదపడం లేదంటూ తిరిగి పవన్ నే ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వైకాపా, కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా పవన్ పై ప్రశ్నలదాడి చేయడంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more