ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్లపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల దాటవేత వైఖరి అవలంబిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏమో ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని చెప్పడం లేదు, అలాగే కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్లపై స్పందించడం లేదంటూ వారిద్దరి వైఖరిని తూర్పారబట్టారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రెండు కేసులపైన సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్రానికి లేఖలు రాయాలని కాంగ్రెస్ నేత డిగ్గీ రాజా డిమాండ్ చేశారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షించేలా చూడాలని ఆయన కోరారు. అలా కానీ పక్షంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తాయని ఆయన హెచ్చరించారు.
ఐపిఎఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీని విదేశాలకు పంపించే విషయంలో జరిగిన అక్రమాలు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పూర్తిగా తెలుసని దిగ్విజయ్సింగ్ అన్నారు. 15 రోజులుగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రధాని మౌనంగా ఉండటం ద్వారా లలిత్మోడీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిం చారు. నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయం లోనే వీరి మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. కేసుల్లో ఉన్న లలిత్ మోడీ దేశం దాటిపోయేందుకు సుష్మాస్వరాజ్ సహకరించారన్నారు. ఈ విషయాన్ని ఆమె అంగీకరిస్తున్నారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని కాంగ్రెస్ నేత అన్నారు. నిబంధనలు ఉల్లఘించి, చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలు ప్రధాన మంత్రికి తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే రాజస్దాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా అక్రమాలకు పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నా ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలే దన్నారు. అవినీతి రహిత పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ఏడాది పాలనలోనే బీజేపీ వైఖరి బయటపడిందన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more