సామాజిక మాధ్యమమైన ‘ట్విటర్’లో ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం యాక్టివ్ గానే వుంటారు. ఆ మాధ్యమం వేదికగా ఆయన రాజకీయ వ్యవహారాలను తెలియజేయడంతోపాటు ప్రజలకు సందేశాత్మకంగా ట్వీట్లు చేస్తుంటారు. అలాగే.. కొన్ని చారిత్రిక ఘట్టాలపై ఆయన అప్పుడప్పుడు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ‘ఎమర్జెన్సీ’ విషయమై ట్వీట్ చేశారు. ‘దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ’ అమలై 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన తన ట్విటర్ అకౌంట్ లో గురువారం అలా ట్వీట్ చేశారు. ఇలా మోడీ చేసిన ఈ ట్వీట్ కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగానే స్పందించారు.
‘గౌరవనీయులైన ప్రధానిగారు.. 40 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో శాంతిభద్రతలపై, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కును కాలరాస్తారని/ఉల్లంఘిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై మీరు వివేకవంతంగా వ్యవహరిస్తారని.. చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈయన ఈ విధంగా ట్వీట్ చేయడానికి గల కారణం ‘సెక్షన్-8’ అంశమే అని స్పష్టంగా అర్థమవుతోంది. హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అటు కేంద్రప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున చర్చలు జరుగున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై విధంగా ట్వీట్ చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ కు మోడీ స్పందన ఎలా వుంటుందో తెలీదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం! సెక్షన్-8 ఖచ్చితంగా అమలవుతుందని.. తెలంగాణ ప్రభుత్వం ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఫలితం దక్కదని వారంటున్నారు. సెక్షన్-8 అమలుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అటు రాజకీయవర్గాల్లోనూ చెప్పుకుంటున్నారు. చివరికి ఈ సెక్షన్-8 పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more