సామాజిక మాధ్యమాలు తెరపైకి వచ్చిన వేళా విశేషం ఏమిటో కాని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. సెల్పీలు దిగటం, వాటిలో ఫోస్టు చేయడం.. ఎన్ని లైకులు వస్తాయి. ఎవరెవరు ఎలా కామెంట్ చేస్తారో చూడటం.. వాటితో ఆనందం పోందడం యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఆ వ్యామోహం ప్రాణాలు తీస్తోంది! కొత్తగా.. సరికొత్తగా సెల్ఫీలు తీసుకోవాలనే ఉబలాటం ప్రాణాలను ఊదేస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్న ఓ యువకుడు రైలు ఇంజన్పైకి ఎక్కడంతో పైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు! ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నానికి చెందిన కనుమూరి సంతో్షవర్మ (20) స్నేహితులతో కలిసి మరో స్నేహితుడి సోదరి వివాహానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చాడు. వారంతా సింహాద్రి ఎక్స్ప్రెస్ నుంచి దిగారు. సంతోష్ వర్మ.. 8వ అవుటర్ లైన్పై నిలిపి ఉన్న రైలు ఇంజన్పైకి ఎక్కి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టే రైలింజన్పైకి ఎక్కాడు.. కానీ, పైన ఉన్న హైటెన్షన్ విద్యు త్ తీగలను గమనించలేదు. దీంతో ఆ వైర్లు అతడికి తగిలి కరెంట్ షాక్ కొట్టి... కింద పడిపోయాడు. 60 శాతం కాలిన గాయాలైన సంతో్షను స్నేహితులు రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్ప లేమని వైద్యులు చెప్పారు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. రైలు ఇంజన్పై నిలబడి సెల్ఫీ తీస్తుండగా కెమెరా ఫ్లాష్ వల్ల విద్యుత్ సరఫరా జరిగి ఇంజన్పై కిందపడ్డాడని చెబుతున్నారు. సెల్ఫోన్ కూడా కాలిపోయింది. రైల్వే పోలీసులుబాధితుని వివరాలు సేకరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more