బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మంచి మనసు కలవాడని బాలీవుడ్ అభిమానులతోపాటు ప్రముఖులు సైతం పొగుడుతుంటారు. ఇప్పటికే ఇతగాడు ‘హ్యూమన్ బీయింగ్’ పేరిట పేదచిన్నారులకు వైద్య సేవలు అందించడం, వ్యాధుల బారిన పడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో ఇతనిని ‘మానవత్వానికి’ మారుపేరుగా బాలీవుడ్ జనాలు చెప్పుకుంటారు. కానీ.. ఇటువంటి మానవతావాదాన్ని కలిగిన సల్మాన్ ఖాన్.. ఓ నిర్మాతను మాత్రం తీవ్రంగా వేధించాడట! కోట్లాధిపతికి వారసుడైన ఈ హీరో కేవలం రూ.15 కోట్ల కోసం ఆ నిర్మాతను మానసిక వేదనకు గురిచేశాడు. అంతే! సల్మాన్ వేధింపులు తాళలేక ఆ నిర్మాత అతనిపై ఏకంగా రూ.250 కోట్ల దావా వేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘వీర్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. మంచి విజయం సాధిస్తుందనుకుని అది బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమాను నిర్మించిన నిర్మాత విజయ్ గలానీకి అది తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో వున్న తనను సల్మాన్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించేవాడట! ఇలా గత మూడేళ్ల నుంచి సల్మాన్ తనని తీవ్రంగా వేధించాడని.. అతని వేధింపులు తాళలేక అంతులేని మానసిక ఆవేదన అనుభవించానని చెబుతున్న గిలానీ బాంబే హైకోర్టులో రూ.250 కోట్ల దావా వేశాడు. తనను వేధించి, తన పరువుకు నష్టం కలిగేలా ప్రవర్తించిన సల్మాన్ ను రూ.250 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
‘అదేంటి.. సినిమా నిర్మాణానికి ముందే రెమ్యునరేషన్ వ్యవహారం గురించి ఒప్పందం కుదుర్చుకుని వుంటారుగా! అప్పుడు వారి మధ్య రూ.15 కోట్ల ఒప్పందం కుదిరి వుంటుంది. ఆ డబ్బుల్నే సల్మాన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది’ అని అందరిలోనూ సందేహం కలుగుతుంది. నిజమే.. సినిమా నిర్మాణానికి ముందు ఈ ఒప్పందాలు జరుగుతాయి. కానీ.. వీరి మధ్య వ్యవహారం వేరేలా వుంది. ‘వీర్’ సినిమా నిర్మాణానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సల్మాన్ మార్కెట్ ని బట్టి 7 లేదా 8 కోట్లు చెల్లించాలని.. ఒకవేళ సినిమా హిట్ అయితే రూ.15 కోట్లు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ సల్మాన్ రూ.15 చెల్లించాలంటూ ఒత్తిడి చేసేవాడని గిలానీ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ వివాదాన్ని తాను ‘నిర్మాతల మండలి’ దృష్టికి తీసుకెళ్లే.. సల్మాన్ కూడా తనపై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్’కు ఫిర్యాదు చేశాడని గిలానీ తెలిపాడు. ఏదో ఒక విధంగా మూడేళ్ల నుంచి సల్మాన్ తనని రెమ్యునరేషన్ విషయమై వేధిస్తూ వస్తున్నాడని.. అతని వేధింపుల కారణంగా తాను అంతులేని మానసిన వేదన అనుభవించానని నిర్మాత కోర్టుకు ఆవేదన వెల్లడించాడు. ఇప్పటివరకు కోర్టు, న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు అంటూ తన దగ్గర వున్న మొత్తం ఖర్చైపోయిందని.. దీనికంతటికి కారణమైన సల్మాన్ కాబట్టి అతనిపై రూ.250 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు ఆయన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. మరి.. ఈ పిటిషన్ పై సల్మాన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more