అవు.ను ఓటుకు నోటు, ట్యాపింగ్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయి ఓ విషయాన్ని మరిచిపోయారు. చంద్రబాబు నాయుడు .పేరు చెబితే ఒళ్లంతా దద్దుర్లు వచ్చిన వారిలాగా జగన్ ఎంత ఎత్తుకు లేస్తాడో అందరికి తెలుసు. ఎప్పుడూ యాత్రల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో టూర్లు వేసే జగన్ తన ప్రతి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు పేరెత్తకుండా మాట్లాడరు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ.. కష్టాల్లో ఉన్నారు. ఏదో చిన్నా చితకా వ్యవహారం కూడా కాదు ఏకంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్ట్ కే ఎసరుపెట్టేంత పెద్ద ఇష్యూ అయినా ఏపిలో దాని గురించి ప్రశ్నించాల్సిన ఓ గొంతు మాయమైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చంద్రబాబు నాయుడు మీద యుద్దానికి ఎప్పుడూ సిద్దంగా ఉండే జగన్ ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయారు. మొత్తానికి జగన్ బాబుగారు కనిపించడంలేదు. ఎవరూ ఫిర్యాదు చెయ్యడం లేదు కానీ ఇది నిజం.
ఓటుకునోటు వ్యవహారంపై ప్రధానప్రతిపక్షం నానాయాగీ చేస్తుందనే అంతా అనుకున్నారు. కానీ వైసీపీ అధినేత రాష్ట్రంలో ఒక రోజు చంద్రబాబు దిష్టి బొమ్మల దహనానికి పిలుపు ఇచ్చారు. అంతే... అంతకు మించి ఒక్క కార్యక్రమాన్ని జగన్ పార్టీ చేయలేదు. చేయలేదు అనే కంటే జగన్ చేయించలేదని అనుకోవాలి. ఎందుకంటే జగన్ కనుసైగ చేయందే పార్టీలో ఏ కార్యక్రమం కూడా అడుగుముందుకేయదు. వెంట జనం రాకున్నా, అసెంబ్లీలో సింగిల్ సీటు లేకున్నా ఏపీ కాంగ్రెస్ ఉన్న కొద్ది మందితో చంద్రబాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో దీక్ష చేసి అందరి దృష్టిలో పడింది. కానీ 67 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ..ఇంత పెద్ద ఎపిసోడ్ లో అడ్రస్ లేకుండాపోయింది. ఇంత సీరియస్ గా రాజకీయాలు జరుగుతుంటే... జగన్ జెరూసలెం పర్యటనకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు నాయకులు. చంద్రబాబు ఇబ్బందుల్లో ఉంటే.. బలపడాల్సిన వైసీపీ బలహీనమైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతోపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతిచ్చి ఏపీకి వైసీపీ ద్రోహం చేసిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వీటిని కూడా తిప్పికొట్టే పరిస్థితి పార్టీలో కనిపించకపోవడం విశేషం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more