రానున్న 24 గంటల్లో సంచలనాలు అంటూ ఏపి ప్రభుత్వం తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రింగులోకి దిగింది. మాటల్లో కాకుండా చేతల్లో అన్నట్లు రాత్రి పూట తెలంగాణ ఏసీబీ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై దృష్టిసారించారు. ముందుగా సండ్ర వెంకట వీరయ్య ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. అయితే అక్కడి నుండి వేం నరేందర్ రెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు అక్కడ ఆయనతో కాసేపు మాట్లాడారు. అయితే గంట పాటు తమతో పాటు రావాలని కోరారని, అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందున రాలేనని వేం నరేందర్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఉదయం ఏసీబీ అధికారులు కోరినట్లు హాజరవుతానని చెప్పారు.
కేసుకు సంబంధించి కొంత సమాచారం కావాలని, గంటపాటు తమతో రావాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే... నా ఆరోగ్య పరిస్థితి రీత్యా, అర్ధరాత్రి సమయంలో వారితో రాలేనని చెప్పాను. బుధవారం ఉదయం ఎప్పుడైనా విచారణకు వస్తానని, సహకరిస్తానని స్పష్టం చేశాను. నోటీసులు ఏవైనా ఉన్నాయా అని కూడా అడిగాను. అలాంటివేవీ లేవని అధికారులు చెప్పారని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు... సండ్ర వెంకట వీరయ్యకు కూడా ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చెయ్యవచ్చునని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ముడుపుల కేసులో రెండో నిందితుడైన సెబాస్టియన్ ఫోన్ నుంచి సండ్ర వీరయ్యకు కాల్స్ వెళ్లినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో లబ్ధి చేకూరేది ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన వేం నరేందర్ రెడ్డికే కాబట్టి... ఆయనను కూడా ప్రశ్నించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో... ఇద్దరికీ నోటీసులు జారీ చేసే దిశగా అడుగు వేయడం గమనార్హం. వీరితోపాటు ముడుపుల కేసుతో సంబంధమున్న వారందరికీ నోటీసులు ఇచ్చి తీరుతామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... తనకు ఏసీబీ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఒకవేళ అందితే సమాధానం ఇస్తానని చెప్పారు. మొత్తానికి తెలంగాణ సర్కార్ ఏపి సర్కార్ హెచ్చరికతో స్పీడ్ పెంచింది. కేసుతో సంబందం ఉంది అనుకుంటున్న అందరికి నోటీసులు జారీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఏసీబీ.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more