సాధారణంగా ఎవరికైనా అదృష్టం కలసివస్తే.. నక్క తోక తోక్కాడని చమత్కరిస్తుంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఓ అదృష్టవంతుడు ఏకంగా శతాధిక నక్కల తోక తోక్కివుంటాడనే చెప్పాలి. ఇక మరోలా చెప్పాలంటే.. భగవంతుడు మీకు ఇవ్వాలనుకుంటే.. చప్పర్ ఫడ్ కే అన్నట్లుగా ఇస్తారని కూడా అంటుంటారు కొందరు. అది కూడా నిజమే.. ఎందుకంటే.. ఈ అదృష్టవంతుడికి ఏకంగా 900 కోట్ల రూపాయలను అందిస్తున్నాడు పైవాడు. అదేంటని అంతలా ఆశ్చర్యపోకండి. మనం కోసం భగవంతుడు కిందకు దిగివచ్చి డబ్బును ఇస్తాడా..? కాదు కదా..? అయితే భూమ్మిదే ఏదో ఒక రూపంలో అంత డబ్బును అందుకునేలా అదృష్టాన్ని రాసి పెడతాడు. నిజమండి.. నమ్మలేకపోతున్నారా..?
ఇటీవల ఒక 80 ఏళ్ల వృద్దురాలికి కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆ తరువాత ఓ వ్యవసాయదారుడికి కూడా మిలయన్ డాలర్ల లాటరీ తగిలింది. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మరో అదృష్టవంతుడికి ఏకంగా 900 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. వివరాల్లోకి వెళ్తే..లండన్ లోని 9 కోట్ల 33 లక్షల 88 వేల 943 పౌండ్ల యూరో మిలియన్స్ లాటరీ కోట్టేశాడు ఓ అదృష్టవంతుడు. అయితే ఈ టిక్కెట్ కోన్న అధృష్టవంతుడు మాత్రం ఎవరో తెలియదని, అయితే అతను సదరు టిక్కెట్ ను తమకు అందజేసిన తరువాత అతని వివరాలను వెళ్లడిస్తామని లాటరీ నిర్వహకుడు కామెలాట్ తెలిపారు.
కాగా, లాటరీ టిక్కెట్ కోనుగోలు చేసిన వ్యక్తి తాన పేరును గోప్యంగా వుంచదలుచుకుంటే మాత్రం తాము అలానే చేస్తామని చెప్పారు. 2004 లో యూరో మిలియన్ ప్రారంభమైనప్పటి నుంచి 2011 లో అతిపెద్ద బహుమతిగా 161 మిలియన్ పౌండ్లను స్కాట్లాండ్ కు చెందిన జంట గెలుచుకున్నారని, ఆ తరువాత నిర్వహించిన అతిపెద్ద బహుమతుల్లో ఈ ఏడాది నిర్వహించిన బహుమతి వరుస క్రమంలో ఆరవదిగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది 93 మిలియన్ పౌండ్ల బహుమతిని గెలుచుకున్న వ్యక్తులు వస్తే తమకు బహుమతిని అందజేస్తామని కామెలాట్ చెప్పారు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more