నూతన రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శభూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వే నంబర్లోని బెజవాడ సత్యనారాయణకు చెందిన స్థలంలో శాస్త్రోక్తంగా పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య కృష్ణా నదికి ఈశాన్యంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో భూమిపూజ కార్యక్రమాలు పూర్తిగా సంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా జరగనున్నాయి. రేపల్లె ప్రాంతం నల్లూరికి చెందిన దాశరధి సిద్ధాంతి ఆధ్వర్యంలో వాస్తు సిద్ధాంతులు సూచించిన ప్రదేశంలో వేద పండి తుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా నాభిశిల స్థాప నం, హోమాలు, పూజలు నిర్వహించనున్నారు.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటగా గంగా, కావేరి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ జలాలతో పాటు పవి త్ర మానస సరోవర్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన జలంతో భూమిపూజ స్థలాన్ని సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం గో పూజతో కార్యక్రమాలు మొదలుకానున్నాయి. భూమిపూజవైష్ణవ సంప్రదాయం ప్రకారం తొలుత విశ్వక్షేణ పూజతో ప్రారంభం కానుంది. అనంతరం పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, వాస్తు పూజహోమం, రత్నన్యాపం, హలయజ్ఞం, వేద పండితుల అశీర్వచన కార్యక్రమాలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్లు భూమిపూజలో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. భూమిపూజ జరిగే స్థలంలో ప్రత్యేకంగా రాతితో తయారు చేసిన నాభిశిలను ప్రతిష్టించనున్నారు. తెనాలిలో ప్రత్యేకంగా వెండితో తయారు చేసిన బంగారు పూత పూసిన తాపీ భూమిపూజకు ఉపయోగించనున్నారు. హలయజ్ఞం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో సీఎం చంద్రబాబు సంప్రదాయ బద్దంగా ఆరక దున్నుతుండగా ఆయన స తీమణి భువనేశ్వరి ఆ ప్రాంతంలో నవధాన్యాలు చల్లనున్నారు. పూజ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో మాట్లాడనున్నారు.
భూమిపూజ జరిగే ప్రాంతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రత అధికారి జోషి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామగ్రిని మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్కు అందజేశారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more