ప్రస్తుతం కూరగాయాల ధరలు ఆకాశనంటుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 20కి పైనే పలుకుతున్నాయి. ఇక చేపలైతే కిలోకు రెండొందల రూపాయలకు పైమాటే.. మృగశిరకార్తె దగ్గరకు వస్తున్న కొద్దీ వీటి ధర ఇంకా పెరుగుతుంది. కానీ ఆ జిల్లాలో మాత్రం ఈ జలపుష్పాల ధర అమాంతం పడిపోయింది. 5 నుంచి 15 రూపాయలకే కిలో చేపలు దొరుకుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చేపల ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ఆకివీడులో నైతే మరీ చీప్ అయిపోయాయి. వంద రూపాయలు పెడితేకానీ దొరకని చేపలు ఇప్పుడు 5 నుంచి పదిహేను రూపాయలకే వస్తున్నాయి. రేట్లు తగ్గడంతో చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. రేట్లు తగ్గడంతో ఆకివీడులో జనం ఆనందంలో ఉంటే.. చేపల రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
కిలో చేప తయారవ్వడానికి 75 రూపాయలు ఖర్చవుతుంది. రవాణా ఖర్చలు, లాభం చూసుకొని వంద రూపాయలకు అమ్మేవారు. అయితే ఇటీవల వాతావరణంలో చేసుకున్న మార్పులు చేపలకు మృత్యుపాశంగా మారాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు.. కొల్లేరు, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని చెరువుల్లో ఆక్సీజన్ శాతం తగ్గి.. భారీ సంఖ్యలో చేపలు చనిపోయాయి. చేసేది లేక ఆక్వా రైతులు వాటిని ఆటోల్లో, వ్యాన్లలో ఆకివీడు మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే ఒక్కసారిగా సరుకు పెరిగిపోయేసరికి.. దళారులు.. చేపల రైతులను నిలువునా దోచేస్తున్నారు. కిలో 5 నుంచి 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తాం... అమ్మితే అమ్మండి లేకుంటే లేదని దబాయిస్తున్నారు. పోనీ... తామే అక్కడుండి సరుకు అమ్మకుందామనుకుంటే.. చేపలను నిలువ ఉంచేందుకు కావాల్సిన ఐస్ బాక్సులు అక్కడ లేవు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏదో ధరకు సరుకు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే తమకు ఈ కష్టం ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. చేపలు ధరలు అమాంతం పడిపోవడంతో వినియోగదారులతో మార్కెట్ కళకళలాడుతోంది. ఐతే.. చేపలు పెంచే రైతులే దిగాలుగా ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more