టీఆర్ఎస్ కేసీఆర్ వర్సెస్ టీడీపీ రేవంత్ రెడ్డి పోరు కోనసాగుతుందని, తమపై అక్రమంగా కేసులు బనాయించి లోబర్చుకుని పార్టీలో కలుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తుందని.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఫోన్ చేసి రమ్మంటేనే తాను వెళ్లానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన తాను ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి కానని చెప్పారు.
ఈ కేసు విషయంపై రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తననపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అన్ని కేసులను తాను కూడా రాజకీయంగానే ఎదుర్కొంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పై కూడా ఇలాంటి కేసులు పెట్టి తనను అరెస్టు చేసిన పోలీసులతోనే కేసీఆర్ ను అరెస్టు చేయిస్తామని చెప్పారు. టీడీపీ క్యాంప్ ఒకచోట సాగుతుండగా, మీరు ఇక్కడకు ఎందుకువచ్చారని ప్రశ్నించిన మీడియాను మీ కార్యాలయాలు ఎక్కడో వుంటే మీరు ఇక్కడకు రాలేదా..? అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అక్రమ విధానాలన్నింటినీ తాము తిరగతోడిస్తామని చెప్పారు.
నామినేటడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తున్న క్రమంలో అరెస్టు చేశారన్న మీడియా ప్రశ్నలపై ఆయన అక్రమంగా డబ్బును తీసుకువచ్చిన పోలీసులు.. తనపై అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వమే ఇరికించిందని రేవంత్ అరోపించారు. కాగా రేవంత్ రెడ్డిని లాలాగూడ నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రత్యేక ప్రదేశంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. అతన్ని బంజారాహిల్స్ లోని ఏసీబి కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more