మహానాడును సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని భావిస్తున్న టీడీపీ అధిష్టానానికి ఆ మరుసటి రోజునే షాక్ ఎదురైంది. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఊదరగోట్టే అధినేత డైలాగులు అతనికి రుచించినట్టు లేదు. అందుకే గత కోంత కాలంగా పార్టీ నుంచి దూరంగా జరిగిన ఆయన ఏకంగా పార్టీ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ప్లేటు ఫిరాయించాడు. తమది నాయకులను తయారు చేసే కర్మగారమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తమ పార్టీలో ఎక్కడ లోపముందో తెలుసుకోకుండా కూడా విశ్లేషించే ప్రయత్నం చేయకపోవడంతో పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.
తాజాగా తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్లోని ఫాంహౌస్లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ లో ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణారావు మాత్రం ఆయనకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఉదయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడీపీ సమావేశానికి కూడా కృష్ణారావు హాజరు కాలేదు. కాగా, టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన చంద్రబాబుకు, నారా లోకేశ్ కు క్షమాపణలు చెప్పారు. టీడీపీలో తనకు సరైన గౌరవం లభించిందని, అయితే నియోజకవర్గ అభివృద్ది కోసం మాత్రమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు.
సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more