ఎండా కాలం ఎండలు సహజం. కానీ ఎండల తీవ్రత ఎక్కుగా ఉండటం.. ఎక్కువ అంటే ఏదో ఒక్క డిగ్రీ కాదు ఏకంగా నాలుగు డిగ్రీలు పెరగడంతో జనాలు నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు హీట్ పుట్టిస్తోంది. రెండు మూడు రోజుల్నుంచి బాదేస్తున్నాడు సూరీడు. 40 డిగ్రీల పైన నుంచోని కాక పుట్టిస్తున్నాడు. డే టైంలోనే కాదు. రాత్రి టైంలో కూడా వెదర్ అంతే ఉంది. వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతతో జనం ఇరిటేట్ అవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు ఆన్ లోనే ఉన్నా.. ఉక్కపోత తప్పట్లేదు. ఈ ఎండాకాలంలో రెండు మూడు సార్లు వరస పెట్టి వానలు దంచినా.. హీట్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి వరకు అప్పుడప్పుడూ రిలీఫ్ అయిన జనానికి.. నాన్ స్టాప్ గా బాదేస్తోన్న ఉష్ణోగ్రత తిప్పలు తెచ్చిపెట్టింది. బంగాళాఖాతం ఉపరితలంపై ఉన్న వెదర్.. టెంపరేచర్ పెరగడానికి రీజనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వేడి గాలులు రాష్ట్రంలోకి వచ్చాయని చెబుతున్నారు.
ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి ఇదే కారణమంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డవగా.. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 42 డిగ్రీలు.. ప్రతి జిల్లాలోనూ కనీసం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటున్నారు అధికారులు. అయితే.. నైరుతీ రుతుపవనాలు దేశంలోకి వచ్చే ముందు.. ఎండ ఇలాగే ఉంటుందనేది నిపుణుల మాట. అండమాన్ లోకి నైరుతీ రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ మూడ్రోజులైంది. ఈ నెల చివరిలోగా కేరళలోకి వస్తాయని చెబుతున్నారు అధికారులు. ఎండని ఈజీగా తీసుకోకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. మరో మూన్నాలుగు రోజుల పాటు.. సూరీడు కూల్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. పాపం అప్పటి దాకా మనకు ఈ కష్టాలు తప్పవు మరీ.. సో బీ కేర్ ఫుల్..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more